LOADING...
Indian airlines: మేలో దేశీయ విమాన ప్రయాణికులు 1.53 కోట్లకు చేరిక.. ఏప్రిల్‌తో పోలిస్తే 11% వృద్ధి
ఏప్రిల్‌తో పోలిస్తే 11% వృద్ధి

Indian airlines: మేలో దేశీయ విమాన ప్రయాణికులు 1.53 కోట్లకు చేరిక.. ఏప్రిల్‌తో పోలిస్తే 11% వృద్ధి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2026
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ విమాన ప్రయాణానికి మే నెలలో మంచి ఊపు కనిపించింది. భారతీయ విమానయాన సంస్థలు మే నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 1.53 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చాయి. ఏప్రిల్‌లో నమోదైన 1.38 కోట్ల మంది ప్రయాణికులతో పోలిస్తే ఇది 11 శాతం పెరుగుదలగా నమోదైంది. గత ఏడాది 2025 మే నెలతో పోల్చినా ఈ ఏడాది మేలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 9.49 శాతం పెరగడం విశేషం. దీంతో దేశీయ విమాన ప్రయాణానికి డిమాండ్‌ స్థిరంగా పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.

వివరాలు 

ఆకాశ ఎయిర్ మార్కెట్‌ వాటా 5.8 శాతం

మార్కెట్‌ వాటా పరంగా చూస్తే, దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వాటా మే నెలలో 64.9 శాతానికి స్వల్పంగా తగ్గింది. మరోవైపు ఎయిర్ ఇండియా గ్రూప్ తన వాటాను 25.6 శాతానికి పెంచుకుని మరింత బలపడింది. ఇక ఆకాశ ఎయిర్ మార్కెట్‌ వాటా 5.8 శాతం వద్ద యథాతథంగా కొనసాగింది. అయితే స్పైస్‌జెట్ మార్కెట్‌ వాటా తగ్గి 2.5 శాతానికి చేరింది. సమయపాలన (ఆన్‌టైమ్‌ పెర్ఫార్మెన్స్‌- ఓటీపీ) విషయంలో కూడా ఇండిగో అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని 10 ప్రధాన విమానాశ్రయాల్లో ఇండిగో 82.8 శాతం ఓటీపీ నమోదు చేసింది. ఆ తర్వాత ఆకాశ ఎయిర్ 78.3 శాతం, ఎయిరిండియా గ్రూప్ 74.5 శాతం ఓటీపీతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి.

Advertisement