Loading...
Stock Market: బ్యాంకింగ్ షేర్ల ఒత్తిడితో సూచీల జోరు మందగింపు.. స్వల్ప లాభాల్లో మార్కెట్
బ్యాంకింగ్ షేర్ల ఒత్తిడితో సూచీల జోరు మందగింపు.. స్వల్ప లాభాల్లో మార్కెట్

Stock Market: బ్యాంకింగ్ షేర్ల ఒత్తిడితో సూచీల జోరు మందగింపు.. స్వల్ప లాభాల్లో మార్కెట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం సానుకూల వాతావరణం కనిపిస్తోంది. అయితే బ్యాంకింగ్ రంగంలో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి ప్రధాన సూచీల వేగాన్ని తగ్గిస్తోంది. సోమవారం నమోదైన భారీ ర్యాలీ తర్వాత గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.68 వద్ద బలపడడం మార్కెట్‌కు కొంత మద్దతుగా నిలిచింది. ఈ పరిణామాల మధ్య సెన్సెక్స్‌, నిఫ్టీ స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో 76,835 వద్ద ముగిసిన సెన్సెక్స్‌ మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ, అనంతరం లాభాల బాట పట్టింది.

వివరాలు 

24 వేల మార్క్‌ను అధిగమించిన నిఫ్టీ

ఉదయం 9:40 గంటల సమయానికి సెన్సెక్స్‌ 92 పాయింట్లు పెరిగి 76,928 వద్ద కొనసాగుతోంది.

అదే సమయంలో నిఫ్టీ కూడా సానుకూల ధోరణిని కొనసాగిస్తూ 24 పాయింట్లు లాభపడి 24,020 వద్ద ట్రేడవుతోంది.

దీంతో నిఫ్టీ మరోసారి కీలకమైన 24 వేల మార్క్‌ను అధిగమించింది.

షేర్ల వారీగా చూస్తే కోఫోర్జ్‌, లోధా డెవలపర్స్‌, ఎంఫసిస్‌, పెర్సిస్టెంట్‌, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

మరోవైపు గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌, సీజీ పవర్‌, భారత్ ఎలక్ట్రిక్‌, కోల్ ఇండియా, వెర్నోవా టీడీ షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి.

బ్యాంకింగ్ రంగంలో బలహీనత కొనసాగుతుండటంతో బ్యాంక్ నిఫ్టీ 219 పాయింట్లు నష్టంలో ట్రేడవుతోంది.

అయితే నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 76 పాయింట్లు లాభపడి సానుకూల ధోరణిని కొనసాగిస్తోంది.

ADVERTISEMENT