Page Loader
Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్ 
Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్

Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్ 

వ్రాసిన వారు Stalin
Nov 20, 2023
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఉద్యోగులకు త్రైమాసిక పనితీరు బోనస్‌ను ప్రకటించింది. ఈ నెల వేతనంతో కలిపి కంపెనీ 80శాతం బోనస్‌ను చెల్లించనుంది. మేనేజర్ నుంచి అంతకంటే తక్కువ ఉద్యోగులకు మాత్రమే వేరియబుల్ పేను కంపెనీ చెల్లించనుంది. జూన్ 2023 త్రైమాసికంలో కూడా కంపెనీ అదే సగటు వేరియబుల్ పే చెల్లించింది. ఇన్ఫోసిస్ ఉద్యోగులు జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి 60శాతం సగటు వేరియబుల్ వేతనం, జూన్ 2022 త్రైమాసికానికి 70శాతం సగటు వేరియబుల్ వేతనం పొందారు. ఈ వార్తతో కంపెనీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆనందంలో కంపెనీ ఉద్యోగులు