Page Loader
జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి
ఈ రెండు 5G సేవలను అక్టోబర్ 2022లో ప్రారంభించాయి

జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 12, 2023
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్ జియో తన 5G సేవలను ఉత్తరాఖండ్‌కు అందుబాటులోకి తెచ్చింది. అర్హత ఉన్న వినియోగదారులు జియో వెల్‌కమ్ ఆఫర్ ద్వారా ఆహ్వానించబడటంతో పాటు ఉచితంగా 1Gbps వేగంతో అపరిమిత డేటాను పొందుతారు. భారతీ ఎయిర్‌టెల్ తన 5G నెట్‌వర్క్‌ను కొచ్చిలో మొదలుపెట్టింది. వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా 4G కంటే 20-30 రెట్లు వేగవంతమైన వేగంతో 5G వాడుకోవచ్చు. జియో డిసెంబర్ 2023 నాటికి భారతదేశంలో 5Gను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇటీవల తన ప్రీపెయిడ్ వినియోగదారులకు '5G అప్‌గ్రేడ్' డేటా ప్లాన్‌ను ప్రకటించింది. ఎయిర్‌టెల్ కూడా తన 5G నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. మార్చి 2024 నాటికి దేశం మొత్తం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

నెట్వర్క్

5G నెట్‌వర్క్‌ని యాక్సెస్ చేయడానికి కొత్త SIMని కొనుగోలు చేయవలసిన అవసరం లేదు

జియో 5G ప్లస్ ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్ నుండి మనా వరకు అందుబాటులో ఉంది. ప్రస్తుత పెట్టుబడి రూ. 4,950 కోట్లకి అదనంగా మరో రూ. 650 కోట్లు, ఉత్తరాఖండ్‌లో స్టాండ్-ఎలోన్ 5G నెట్‌వర్క్‌ని అమలు చేయడంలో ఖర్చు చేస్తుంది. ఎయిర్ టెల్ 5G ప్లస్ కొచ్చిలో పనంపిల్లి నగర్, రావిపురం, జవహర్ నగర్, కడవంతర, కచేరిపడి, కలూర్, ఎలమక్కర, ఎర్నాకులం టౌన్ హాల్, ఎర్నాకులం KSRTC జంక్షన్, ఎడపల్లి, MG రోడ్, పలరివట్టం NH, Vopymptilavanur, Thopymptilavanurలో ప్రారంభించింది. 5G నెట్‌వర్క్‌ని యాక్సెస్ చేయడానికి కొత్త SIMని కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. కాకపోతే 5G సేవలను ఆస్వాదించడానికి స్మార్ట్‌ఫోన్‌ను తాజా సాఫ్ట్‌వేర్‌కి అప్‌గ్రేడ్ చేయాలి.