NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Jio Financial:జియో పేమెంట్‌ సొల్యూషన్స్‌కు RBI అనుమతి: కొత్త సేవలు, డిజిటల్‌ గోల్డ్ 
    తదుపరి వార్తా కథనం
    Jio Financial:జియో పేమెంట్‌ సొల్యూషన్స్‌కు RBI అనుమతి: కొత్త సేవలు, డిజిటల్‌ గోల్డ్ 
    జియో పేమెంట్‌ సొల్యూషన్స్‌కు RBI అనుమతి: కొత్త సేవలు, డిజిటల్‌ గోల్డ్

    Jio Financial:జియో పేమెంట్‌ సొల్యూషన్స్‌కు RBI అనుమతి: కొత్త సేవలు, డిజిటల్‌ గోల్డ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 29, 2024
    03:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన జియో పేమెంట్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ (JSPL) ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ అగ్రిగేటర్‌గా కొనసాగేందుకు భారత రిజర్వు బ్యాంకు (RBI) నుండి అనుమతి పొందింది.

    ఈ విషయాన్ని కంపెనీ మంగళవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు అధికారికంగా తెలియజేసింది.

    అక్టోబర్‌ 28 నుంచి ఈ అనుమతి చెల్లుబాటు అవుతుందని కంపెనీ పేర్కొంది.

    ఈ సమయంలో, జియో ఫైనాన్షియల్‌ షేరు నేడు రాణించింది, ఎన్‌ఎస్‌ఈలో స్వల్ప లాభంతో రూ.323 వద్ద కొనసాగుతోంది.

    వివరాలు 

    డిజిటల్‌ గోల్డ్ కొనుగోలు: స్మార్ట్‌ గోల్డ్ సదుపాయం 

    ధన త్రయోదశి(Dhanteras)సందర్భంగా, జియో ఫైనాన్షియల్‌ సంస్థ నూతన సేవలకు శ్రీకారం చుట్టింది.

    జియో ఫైనాన్షియల్‌ యాప్‌ ద్వారా వినియోగదారులు సులభంగా డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు చేసేందుకు 'స్మార్ట్‌ గోల్డ్‌' సదుపాయాన్ని ప్రారంభించింది.

    వినియోగదారులు తమ యాప్‌ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు చేయవచ్చు.

    ఇందులో రూ.10 నుంచి పెట్టుబడి పెట్టడం సాధ్యమవుతోంది. వారు డిజిటల్‌ గోల్డ్‌ను క్యాష్ లేదా ఫిజికల్‌ గోల్డ్‌ రూపంలో పొందవచ్చు.

    వివరాలు 

    జియో-బ్లాక్‌రాక్‌ జాయింట్‌ వెంచర్‌ 

    జియో ఫైనాన్షియల్‌ సంస్థ, బ్లాక్‌రాక్‌తో కలిసి రెండు జాయింట్‌ వెంచర్‌ కంపెనీలను ఏర్పాటుచేయాలని ప్రకటించింది.

    జియో బ్లాక్‌రాక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జియో బ్లాక్‌రాక్‌ ట్రస్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలను స్థాపించడానికి కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి సర్టిఫికెట్‌ పొందినట్లు ఇరు కంపెనీలు వెల్లడించాయి.

    నియంత్రణ సంస్థల ఆమోదానికి అనుగుణంగా, మ్యూచువల్‌ ఫండ్‌ కార్యకలాపాలను త్వరలో ప్రారంభించడానికి యోచిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జియో

    తాజా

    AP Rains: అకాల వర్షానికి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు అతలాకుతలం.. స్తంభించిన జనజీవనం అనంతపురం అర్బన్
    Chikmagalur: ఊటీ, మున్నార్‌ను మర్చిపోండి... ఇప్పుడు ఈ కొత్త హిల్ వైపే అందరిచూపు!  కర్ణాటక
    Income Tax Returns: ఆదాయపు పన్ను రిటర్నులకు సిద్ధంగా ఉన్నారా? ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    USA: పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ రుణం ఇవ్వడంపై తప్పుపడుతున్న అమెరికా సైనిక వ్యూహాకర్తలు  అమెరికా

    జియో

    రిలయన్స్ జియోతో జతకట్టిన మోటోరోలా.. వినియోగదారులకు 5జీ థ్రిల్! టెక్నాలజీ
    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో ప్లాన్
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు రిలయెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025