Loading...
Stock Market: ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం.. సెన్సెక్స్ 700 పాయింట్లు పతనం.. 24,500 సమీపంలో నిఫ్టీ
ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం..

Stock Market: ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం.. సెన్సెక్స్ 700 పాయింట్లు పతనం.. 24,500 సమీపంలో నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2026
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ప్రారంభంలో మంచి లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ, ఆ జోరు ఎక్కువసేపు నిలవలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్, హోర్ముజ్ జలసంధిపై చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ఆందోళన దేశీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ప్రారంభ లాభాలను పూర్తిగా కోల్పోయి నష్టాల్లోకి జారాయి. ఉదయం ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 626.43 పాయింట్లు లేదా 0.79 శాతం పెరిగి 79,055.38 వద్దకు చేరుకోగా,ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 62.70 పాయింట్లు లేదా 0.25 శాతం లాభపడి 24,677.60 స్థాయిని తాకింది. అయితే మధ్యాహ్నం 1:57 గంటల సమయానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

వివరాలు 

2,140 షేర్లు లాభాల్లో

సెన్సెక్స్ 90.09 పాయింట్లు లేదా 0.11 శాతం తగ్గి 78,338.86 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 103.25 పాయింట్లు లేదా 0.42 శాతం క్షీణించి 24,511.65 వద్ద కొనసాగింది.

రోజు గరిష్ఠ స్థాయి నుంచి సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కీలకమైన 24,500 స్థాయికి చేరువలో ట్రేడైంది.

మార్కెట్లో మొత్తం 2,140 షేర్లు లాభాల్లో ఉండగా, 1,665 షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. మరో 182 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోల్ ఇండియా షేర్లు ఒక శాతం వరకు పడిపోగా, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సన్ అండ్ టుబ్రో షేర్లు రెండు శాతం వరకు లాభపడ్డాయి.

వివరాలు 

మార్కెట్లు లాభాలు కోల్పోవడానికి ప్రధాన కారణాలు

ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం : హోర్ముజ్ జలసంధి త్వరలోనే తిరిగి తెరుచుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

ఒకవేళ ఆ మార్గం మూసి ఉంచితే ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో దాడి చేస్తామని హెచ్చరించారు.

కాలిఫోర్నియా పర్యటనలో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, మరో 48 గంటల్లో పరిస్థితిపై స్పష్టత వస్తుందని ట్రంప్ వెల్లడించారు.

ఈ వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లలో జాగ్రత్త ధోరణి కనిపించింది.

హెచ్‌ఎస్‌టీ వెల్త్ వ్యవస్థాపకుడు,సీఈఓ హరిసెల్వన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, ప్రపంచ స్థాయిలో అనిశ్చితి పూర్తిగా తొలగిపోకపోయినా, పెట్టుబడిదారులు ప్రస్తుతం భౌగోళిక ఉద్రిక్తతల కంటే కంపెనీల త్రైమాసిక ఫలితాలు, మార్కెట్ లిక్విడిటీ, దేశీయ ఆర్థిక వృద్ధి అవకాశాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

లాభాల స్వీకరణ

ప్రారంభంలో మార్కెట్లు బలంగా పెరగడంతో పెట్టుబడిదారులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో కొనుగోలు ఒత్తిడి తగ్గి అమ్మకాలు పెరగడంతో సూచీలు క్రమంగా దిగివచ్చాయి.

24,700 వద్ద బలమైన ప్రతిఘటన

నిఫ్టీ ట్రేడింగ్ సమయంలో 24,677.60 స్థాయిని తాకిన తర్వాత అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది.

ఈ స్థాయికి సమీపంలో బలమైన ప్రతిఘటన ఉండటంతో సూచీ పైకి వెళ్లలేకపోయింది.

యాక్సిస్ సెక్యూరిటీస్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం,24,700 నుంచి 24,772 స్థాయిలు నిఫ్టీకి కీలక ప్రతిఘటన ప్రాంతాలు.

ఈ స్థాయిని అధిగమిస్తే నిఫ్టీ 24,900వరకు వెళ్లే అవకాశం ఉంది.

మరోవైపు 24,500స్థాయి తక్షణ మద్దతుగా ఉండగా,ఆ తర్వాత 24,427స్థాయి మరో కీలక సపోర్ట్‌గా మారే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

ADVERTISEMENT