NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / IRCTC tour package: అజంతా, ఎల్లోరా అందాలను ఆస్వాదిద్దాం రండి..
    తదుపరి వార్తా కథనం
    IRCTC tour package: అజంతా, ఎల్లోరా అందాలను ఆస్వాదిద్దాం రండి..
    అజంతా, ఎల్లోరా అందాలను ఆస్వాదిద్దాం రండి..

    IRCTC tour package: అజంతా, ఎల్లోరా అందాలను ఆస్వాదిద్దాం రండి..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 19, 2024
    04:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ రైల్వే టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్త టూర్ ప్యాకేజీతో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఘృశ్నేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి,అజంతా,ఎల్లోరా గుహలను చూడటానికి అవకాశం అందిస్తోంది.

    ప్రత్యేకంగా తక్కువ సమయంలో ట్రిప్ ప్లాన్ చేస్తున్న వారికి ఈ ప్యాకేజీ అనుకూలంగా ఉంటుంది.

    ప్యాకేజీ వివరాలు:

    ప్యాకేజీ పేరు:"మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర"(MARVELS OF MAHARASHTRA)ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. కాచిగూడ, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నిజామాబాద్ స్టేషన్ల నుండి ఈ రైలు ఎక్కొచ్చు.

    యాత్ర పూర్తయ్యాక కాచిగూడలో రైలు దిగాల్సి ఉంటుంది.

    టికెట్ ధర..రూ.7,400 నుండి ప్రారంభం.యాత్ర వ్యవధి: మూడు రాత్రులు, నాలుగు పగళ్లు. ప్రతి శనివారం ఈ ట్రైన్‌ అందుబాటులో ఉంటుంది.సెప్టెంబర్ 6, 13, 20, 27 తేదీలకు టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.

    వివరాలు 

    రైలు ప్రయాణం ఇలా..

    మొదటి రోజు: సాయంత్రం 6:40 గంటలకు కాచిగూడ నుండి అజంతా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ (నం: 17064) ప్రారంభమవుతుంది. ఆ రాత్రంతా ప్రయాణం.

    రెండో రోజు: ఉదయం 4:40 గంటలకు ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌ చేరుకోతారు. అక్కడ హోటల్‌కి తీసుకెళ్లి అల్పాహారం అందిస్తారు. తరువాత, ఎల్లోరా గుహలను సందర్శించి, ఘృశ్నేశ్వర ఆలయాన్ని దర్శిస్తారు. సాయంత్రం బీబీ కా మక్బారా (Bibi-ka-Maqbara) వీక్షిస్తారు. ఆ రాత్రి అక్కడే బస.

    మూడో రోజు: టిఫిన్ తర్వాత అజంతా గుహలను సందర్శిస్తారు. సాయంత్రం ఔరంగాబాద్‌కి తిరిగి చేరుకుంటారు. రాత్రి 8:00 గంటలకు రైలు (ట్రైన్ నం: 17063) ఎక్కుతారు.

    నాలుగో రోజు: ఉదయం 9:45 గంటలకు కాచిగూడ చేరడంతో ప్రయాణం ముగుస్తుంది.

    వివరాలు 

    ప్యాకేజీ ఛార్జీల వివరాలు: 

    ఒకరు నుంచి ముగ్గురు వ్యక్తులు బుక్ చేసుకున్నప్పుడు:

    కంఫర్ట్ (థర్డ్ ఏసీ బెర్త్):

    రూమ్ సింగిల్ షేరింగ్: రూ.22,920

    ట్విన్ షేరింగ్: రూ.12,650

    ట్రిపుల్ షేరింగ్: రూ.10,050

    5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు:

    విత్ బెడ్: రూ.8,630

    విత్ అవుట్ బెడ్: రూ.6,890

    స్టాండర్డ్ (స్లీపర్ బెర్త్):

    రూమ్ సింగిల్ షేరింగ్: రూ.21,440

    ట్విన్ షేరింగ్: రూ.11,170

    ట్రిపుల్ షేరింగ్: రూ.8,570

    5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు:

    విత్ బెడ్: రూ.7,150

    విత్ అవుట్ బెడ్: రూ.5,410

    వివరాలు 

    నలుగు నుంచి ఆరుగురు వ్యక్తులు బుక్ చేసుకున్నప్పుడు: 

    కంఫర్ట్ (థర్డ్ ఏసీ):

    డబుల్ షేరింగ్: రూ.9,930

    ట్రిపుల్ షేరింగ్: రూ.8,880

    5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు:

    విత్ బెడ్: రూ.8,630

    విత్ అవుట్ బెడ్: రూ.6,890

    స్టాండర్డ్ (స్లీపర్ బెర్త్):

    డబుల్ షేరింగ్: రూ.8,440

    ట్రిపుల్ షేరింగ్: రూ.7,400

    5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు:

    విత్ బెడ్: రూ.7,150

    విత్ అవుట్ బెడ్: రూ.5,410

    వివరాలు 

    ఇవి గుర్తుంచుకోండి..

    ప్యాకేజీ ఎంపిక: ఎంచుకున్న ప్యాకేజీ ప్రకారం, రైల్లో 3 ఏసీ లేదా స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం ఉంటుంది.

    స్థానిక ప్రయాణం: ప్యాకేజీ ప్రకారం, స్థానిక ప్రయాణానికి ఏసీ గదులు మరియు వాహనాలు అందిస్తారు.

    ఆహారం,బస: ఒక్క రాత్రి బస మరియు ఒక రోజు టిఫిన్‌ అందించబడుతుంది.

    ప్రయాణ బీమా: ప్రయాణ బీమా అందించబడుతుంది.

    ప్రవేశ రుసుములు: పర్యటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే, సందర్శకులు స్వయంగా చెల్లించాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతీయ రైల్వే

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    భారతీయ రైల్వే

    Indian Railways- highest Record-Trips: ఏప్రిల్‌లో అత్యధిక ప్రయాణీకుల సంఖ్యను నమోదు చేసిన భారతీయ రైల్వే భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025