NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Moody's-GDP: భారత్‌ వృద్ధిరేటు అంచనాలలో కోత.. ఏడు శాతానికే పరిమితం అంటున్న మూడీ'స్‌..!
    తదుపరి వార్తా కథనం
    Moody's-GDP: భారత్‌ వృద్ధిరేటు అంచనాలలో కోత.. ఏడు శాతానికే పరిమితం అంటున్న మూడీ'స్‌..!
    భారత్‌ వృద్ధిరేటు అంచనాలలో కోత.. ఏడు శాతానికే పరిమితం అంటున్న మూడీ'స్‌..!

    Moody's-GDP: భారత్‌ వృద్ధిరేటు అంచనాలలో కోత.. ఏడు శాతానికే పరిమితం అంటున్న మూడీ'స్‌..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 20, 2025
    05:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ రేటింగ్‌ సంస్థ మూడీ'స్‌ (Moody's) భారత్‌ వృద్ధిరేటు అంచనాలను తగ్గించింది.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో వృద్ధిరేటు 7 శాతమే ఉంటుందని పేర్కొంది.

    గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో వృద్ధిరేటు 8.2 శాతం ఉండగా, ప్రస్తుత వృద్ధి దీనికి తక్కువగా ఉందని వెల్లడించింది.

    జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఈ అంచనాలను తగ్గించినట్టు మూడీ'స్‌ తెలియజేసింది.

    అయితే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొనసాగుతుందని చెప్పింది. 2023-24తో పోల్చితే తలసరి ఆదాయం 10,233 డాలర్లకు చేరి 11 శాతం పెరిగినట్టు వెల్లడించింది.

    వివరాలు 

    2025-26లో జీడీపీ వృద్ధి రేటు 7.2శాతం నుంచి 7శాతానికి పరిమితం

    ఇది మాత్రమే కాకుండా, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటును 7 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించి అంచనా వేసింది.

    2023-24లో జీడీపీ 8.2 శాతంగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు గణనీయంగా తగ్గుముఖం పట్టింది.

    గత డిసెంబర్‌లో ఏషియన్‌ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ (ADB)కూడా భారత్‌ వృద్ధిరేటు అంచనాలను సవరించింది.

    2023-24లో భారత్‌ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంటుందని,పారిశ్రామిక వృద్ధి బలహీనం, ప్రభుత్వ వ్యయంలో తగ్గింపు వంటి అంశాలు దీనికి కారణమని పేర్కొంది.

    ఇండ్ల డిమాండ్‌పై కఠిన ద్రవ్య పరపతి విధానం ప్రభావం చూపుతుందని,2025-26లో జీడీపీ వృద్ధి రేటు 7.2శాతం నుంచి 7శాతానికి పరిమితం అవుతుందని వివరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    భారతదేశం

    Predator Drones: అమెరికాతో భారత్ కీలక డీల్.. దాదాపు $4 బిలియన్ల మెగా ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు అమెరికా
    India-Canada: దిగజారుతున్న భారత్-కెనడా దౌత్య సంబంధాలు.. వ్యాపార సంబంధాలను దెబ్బతీస్తాయా? కెనడా
    India-Canada: కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలకు భారత్‌ గట్టి కౌంటర్‌  కెనడా
    PM Kisan FPO Scheme : రైతుల కోసం కేంద్రం ప్రత్యేక పథకం.. పీఎంకేఎఫ్‌పీఓ కింద రూ.15 లక్షల ఆర్థిక సాయం రైతుబంధు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025