NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / భారత స్టాక్ మార్కెట్‌లో చరిత్ర సృష్టించిన ఎంఆర్ఎఫ్; రూ.1 లక్షకు చేరిన షేరు ధర 
    తదుపరి వార్తా కథనం
    భారత స్టాక్ మార్కెట్‌లో చరిత్ర సృష్టించిన ఎంఆర్ఎఫ్; రూ.1 లక్షకు చేరిన షేరు ధర 
    భారత స్టాక్ మార్కెట్‌లో చరిత్ర సృష్టించిన ఎంఆర్ఎఫ్; రూ.1 లక్షకు చేరిన షేరు ధర

    భారత స్టాక్ మార్కెట్‌లో చరిత్ర సృష్టించిన ఎంఆర్ఎఫ్; రూ.1 లక్షకు చేరిన షేరు ధర 

    వ్రాసిన వారు Stalin
    Jun 13, 2023
    03:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ దలాల్ స్ట్రీట్‌లో చరిత్ర సృష్టించింది.

    భారత స్టాక్ మార్కెట్‌లో తొలిసారిగా షేరు ధర రూ.1లక్షకు చేరిన మొదటి కంపెనీగా ఎంఆర్ఎఫ్ ఖ్యాతిని గడించింది.

    ఎంఆర్ఎఫ్ షేర్లు ఉదయం 10:45 గంటలకు 1.04శాతం పెరిగి ఒక్కొక్కటి రూ. 1,00,000.95వద్ద ట్రేడయ్యాయి.

    దీంతో ఆ కంపెనీ మరో మైలురాయిని అందుకున్నట్లు అయ్యింది. ఈ కంపెనీ షేరు ధర 2021లో తొలిసారిగా రూ.90,000వేలకు చేరుకుంది.

    ఈ స్టాక్ రూ.10వేలు పెరిగి రూ.1లక్షకు చేరుకోవడానికి రెండేళ్లు పట్టింది. దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం అత్యంత ఖరీదైన స్టాక్ గా ఎంఆర్ఎఫ్ ఉంది.

    అయితే ప్రైస్-టు-ఎర్నింగ్స్ (పీ/ఈ) లేదా ప్రైస్-టు-బుక్ వాల్యూ(పీ/బీవీ) వంటి కొలమానాల విషయానికి వస్తే ఇది అత్యంత ఖరీదైనది కాదనే చెప్పాలి.

    స్టాక్ మార్కెట్

    ఈ ఏడాది 14శాతం లాభపడిన స్టాక్ 

    ఎంఆర్ఎఫ్ స్టాక్ గతేడాది 45శాతానికి పైగా గరిష్ట లాభాలను చవిచూశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు దాదాపు 14శాతం లాభపడింది.

    కాగా, గడిచిన మూడేళ్లలో 82శాతం రాబడిని అందించింది. Q4FY23లో కంపెనీ నికర లాభం 86 శాతం పెరిగి రూ. 313.5కోట్లకు చేరుకుంది.

    క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.168.5కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో కోర్ కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం కూడా 10 శాతం పెరిగి రూ.5,842 కోట్లకు చేరుకుంది.

    ఎంఆర్ఎఫ్ షేర్లు 54.52 రెట్లు (పీ/ఈ) గుణకారంతో ట్రేడవుతుండగా, అది ప్రైస్-టు-బుక్ విలువ (పీ/బీవీ) 2.89 రెట్లు మల్టిపుల్‌తో ట్రేడవుతోంది. మూలధనంపై దాని రాబడి 7.34 శాతంగా ఉంది. ఈక్విటీపై దాని రాబడి 5.23 శాతంగా ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    స్టాక్ మార్కెట్

    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం డాలర్
    హిండెన్‌బర్గ్‌ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ గౌతమ్ అదానీ
    అదానీ గ్రూప్ షేర్ 22% పడిపోవడంతో నష్టాన్ని చవిచూసిన LIC గౌతమ్ అదానీ
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ బడ్జెట్ 2023

    తాజా వార్తలు

    'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం ఎంపీ
    లక్నో: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్ బిహార్
    ముంబై హత్య: రెండు కట్టర్లతో శరీరాన్ని 20ముక్కలు చేశాడు; బాధితురాలు అనాథ  ముంబై
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025