NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Mukesh Ambani: హురున్‌ జాబితాలో ముఖేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ.. టాప్-10లో దక్కని చోటు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Mukesh Ambani: హురున్‌ జాబితాలో ముఖేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ.. టాప్-10లో దక్కని చోటు
    హురున్‌ జాబితాలో ముఖేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ.. టాప్-10లో దక్కని చోటు

    Mukesh Ambani: హురున్‌ జాబితాలో ముఖేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ.. టాప్-10లో దక్కని చోటు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 27, 2025
    03:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2025లో భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ టాప్-10 స్థానం కోల్పోయారు. గతేడాది అప్పులు పెరగడం వల్ల ఆయన సంపద రూ.1 లక్ష కోట్ల మేర తగ్గిందని ఈ జాబితా పేర్కొంది.

    అయినా ఆసియాలో అత్యంత సంపన్నుడి హోదాను ఆయన కాపాడుకున్నారు.

    ప్రపంచవ్యాప్తంగా టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సంపద 82 శాతం పెరిగి 420 బిలియన్ డాలర్లకు చేరి అగ్రస్థానంలో నిలిచారు.

    266 బిలియన్‌ డాలర్లతో అమెజాన్ అధిపతి జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) రెండో స్థానంలో ఉన్నారు. మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) 242 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు.

    Details

     భారత మహిళల్లో రోష్ని నాడార్‌ టాప్-10లోకి 

    ఆ తర్వాత ఒరాకిల్‌ సీఈవో లారీ ఎల్లిసన్‌, ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌, గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్‌ ఉన్నాయి.

    హెచ్‌సీఎల్‌ అధినేత శివ్‌నాడార్‌ కుమార్తె రోష్ని నాడార్‌ రూ.3.5 లక్షల కోట్ల సంపదతో ప్రపంచ సంపన్న మహిళల టాప్-10లో చోటు దక్కించుకున్నారు.

    తండ్రి నుంచి హెచ్‌సీఎల్‌లో 47% వాటా పొందడంతో ఆమె ఐదో స్థానానికి చేరారు.

    Details

     భారత సంపన్నుల జాబితా.. అంబానీనే నంబర్-1 

    భారత జాబితాలో ముఖేశ్‌ అంబానీ కుటుంబం తొలి స్థానంలో కొనసాగుతోంది. వారి సంపద 13 శాతం తగ్గి రూ.8.6 లక్షల కోట్లుగా ఉంది.

    ఆ తర్వాత గౌతమ్‌ అదానీ కుటుంబం(రూ.8.4 లక్షల కోట్లు), రోష్ని నాడార్‌ కుటుంబం(రూ.3.5 లక్షల కోట్లు), దిలీప్‌ సంఘ్వీ కుటుంబం(రూ.2.5 లక్షల కోట్లు), అజీమ్‌ ప్రేమ్‌జీ కుటుంబం (రూ.2.2 లక్షల కోట్లు) టాప్-5లో ఉన్నారు.

    భారత బిలియనీర్ల సంఖ్య పెరిగింది

    గతేడాదితో పోలిస్తే భారత బిలియనీర్ల సంఖ్య 45 మంది పెరిగి 284కి చేరింది.

    వీరి కలిపి సంపద విలువ రూ.98 లక్షల కోట్లుగా ఉంది.

    ముంబయి 90 బిలియనీర్లతో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచింది. -

    'బిలియనీర్స్ క్యాపిటల్ ఆఫ్ ఆసియా' హోదాను చైనాలోని షాంఘై దక్కించుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముకేష్ అంబానీ
    వ్యాపారం

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ముకేష్ అంబానీ

    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు ఆటో మొబైల్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్

    వ్యాపారం

    IMF MD: 2025లో భారత ఆర్థిక వృద్ధి బలహీనపడొచ్చు.. ఐఎంఎఫ్‌ హెచ్చరిక  ఐఎంఎఫ్
    Tim Cook: యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వేతనం భారీగా పెంపు.. ఎంతంటే ఆపిల్
    Stock Market: స్టాక్ మార్కెట్లలో భారీ నష్టం.. 800 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ స్టాక్ మార్కెట్
    Salary increase: 2025లో దేశీయ వేతనాలు 9.4శాతం పెరిగే అవకాశం బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025