Page Loader
Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు ప్రారంభ వేళ మార్కెట్‌కి సహాయపడినప్పటికీ, వాణిజ్య సంబంధిత అనిశ్చితి వాతావరణం కారణంగా సూచీలు తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి. దీంతో ఉదయాన్ని లాభాల్లో ఆరంభించిన సూచీలు తరువాత నష్టాల్లోకి మళ్లాయి. ఉదయం 9:25 గంటల సమయంలో, బీఎస్ఈ సెన్సెక్స్‌ సూచీ 153 పాయింట్లు కోల్పోయి 81,184 స్థాయిలో ట్రేడవుతుండగా, ఎన్ఎస్‌ఇ నిఫ్టీ సూచీ 51 పాయింట్ల నష్టంతో 24,664 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

సెన్సెక్స్ 30 లో నష్టపోతున్న కంపెనీలు: 

అదానీ పోర్ట్స్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. లాభాల్లో ఉన్న కంపెనీలు: ఎటర్నల్‌, టాటా స్టీల్‌, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం), టాటా మోటార్స్‌, ఏషియన్ పెయింట్స్‌, టైటాన్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 85.55 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 64.95 డాలర్ల వద్ద ఉంది. బంగారం ఔన్సు ధర 3,364 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం: 

సోమవారం నాటి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.41 శాతం, నాస్‌డాక్ 0.67 శాతం, డోజోన్స్ 0.08 శాతం లాభాలను నమోదుచేశాయి. ఈ ప్రభావంతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా లాభదాయకంగా ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్ 1.41 శాతం, షాంఘై 0.52 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.39 శాతం, జపాన్‌ నిక్కీ 0.20 శాతం లాభాల్లో ఉన్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నాడు నికరంగా ₹2,589 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) అదే రోజు ₹5,314 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.