NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
    నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 03, 2025
    10:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు ప్రారంభ వేళ మార్కెట్‌కి సహాయపడినప్పటికీ, వాణిజ్య సంబంధిత అనిశ్చితి వాతావరణం కారణంగా సూచీలు తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి.

    దీంతో ఉదయాన్ని లాభాల్లో ఆరంభించిన సూచీలు తరువాత నష్టాల్లోకి మళ్లాయి.

    ఉదయం 9:25 గంటల సమయంలో, బీఎస్ఈ సెన్సెక్స్‌ సూచీ 153 పాయింట్లు కోల్పోయి 81,184 స్థాయిలో ట్రేడవుతుండగా, ఎన్ఎస్‌ఇ నిఫ్టీ సూచీ 51 పాయింట్ల నష్టంతో 24,664 వద్ద కొనసాగుతోంది.

    వివరాలు 

    సెన్సెక్స్ 30 లో నష్టపోతున్న కంపెనీలు: 

    అదానీ పోర్ట్స్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    లాభాల్లో ఉన్న కంపెనీలు:

    ఎటర్నల్‌, టాటా స్టీల్‌, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం), టాటా మోటార్స్‌, ఏషియన్ పెయింట్స్‌, టైటాన్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

    డాలరుతో రూపాయి మారకం విలువ 85.55 వద్ద ప్రారంభమైంది.

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 64.95 డాలర్ల వద్ద ఉంది. బంగారం ఔన్సు ధర 3,364 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    వివరాలు 

    అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం: 

    సోమవారం నాటి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి.

    ఎస్ అండ్ పీ 500 సూచీ 0.41 శాతం, నాస్‌డాక్ 0.67 శాతం, డోజోన్స్ 0.08 శాతం లాభాలను నమోదుచేశాయి.

    ఈ ప్రభావంతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా లాభదాయకంగా ట్రేడవుతున్నాయి.

    హాంగ్‌సెంగ్ 1.41 శాతం, షాంఘై 0.52 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.39 శాతం, జపాన్‌ నిక్కీ 0.20 శాతం లాభాల్లో ఉన్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నాడు నికరంగా ₹2,589 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) అదే రోజు ₹5,314 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    IIT Seats: 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 18,160 సీట్లు  ఐఐటీ బాంబే
    Pawan Kalyan: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడంటే? పవన్ కళ్యాణ్
    Russia-Ukraine Conflict: ఫలితమివ్వని రష్యా, ఉక్రెయిన్‌ చర్చలు.. యుద్ధ ఖైదీల మార్పిడికే పరిమితం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    స్టాక్ మార్కెట్

    Stock market: దలాల్‌ స్ట్రీట్‌ను తాకిన భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. అరగంటపాటు నిలిచిన పాక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ బిజినెస్
    Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు వ్యాపారం
    Defense stock: ఉద్రిక్తతల వేళ.. డిఫెన్స్‌ స్టాక్స్‌ పరుగులు.. 18 శాతం పెరిగిన ఐడియాఫోర్జ్ టెక్   బిజినెస్
    Share Market: భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌ మార్కెట్లు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025