NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Reliance-Disney Merger: రిలయన్స్- డిస్నీ విలీనానికి ముందు వయాకామ్‌ బోర్డులోకి నీతా,ఆకాష్ అంబానీ  
    తదుపరి వార్తా కథనం
    Reliance-Disney Merger: రిలయన్స్- డిస్నీ విలీనానికి ముందు వయాకామ్‌ బోర్డులోకి నీతా,ఆకాష్ అంబానీ  
    రిలయన్స్- డిస్నీ విలీనానికి ముందు వయాకామ్‌ బోర్డులోకి నీతా,ఆకాష్ అంబానీ

    Reliance-Disney Merger: రిలయన్స్- డిస్నీ విలీనానికి ముందు వయాకామ్‌ బోర్డులోకి నీతా,ఆకాష్ అంబానీ  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 26, 2024
    04:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి చెందిన ముకేష్ అంబానీ, వాల్ట్‌ డిస్నీకి సంబంధించిన మీడియా వ్యాపారాల విలీనంలో మరొక కీలక దశలో ప్రవేశించారు.

    ఈ క్రమంలో, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ, రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ వయాకామ్‌ 18 బోర్డులో చేరారని సమాచారం.

    వయాకామ్‌ 18 అనేది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బోధి ట్రీ సిస్టమ్స్‌కి చెందిన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగం.

    ఈ ప్రతిపాదిత విలీనం ఇప్పటికే కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(CCI)నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) నైతిక ముద్రను పొందింది.

    CCI సూచనల ప్రకారం,వ్యాపారంలో చిన్న మార్పులు మినహాయించి, విలీనం ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకుంది.

    ఈ సందర్భంగా తల్లీ, కుమారులు బోర్డులో చేరడం ప్రత్యేకంగా గమనార్హం.

    వివరాలు 

     రూ.70,000 కోట్ల విలువతో దేశంలోనే అతిపెద్ద మీడియా 

    వీరి తో పాటు, బోధి ట్రీ సిస్టమ్స్‌ కో ప్రమోటర్‌ జేమ్స్‌ ముర్దోచ్‌, కతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీకి చెందిన మహ్మద్‌ అహ్మద్‌ అల్‌ హర్దన్‌,రిలయన్స్‌లో మీడియా,కంటెంట్‌ వ్యాపార విభాగం ప్రెసిడెంట్‌ జ్యోతి దేశ్‌ పాండే,శువా మొండల్‌ వంటి అనేకులు వయాకామ్‌ 18 బోర్డులో నియమితులయ్యారు.

    విలీనం అనంతరం ఏర్పడే కొత్త సంస్థలో 120టీవీ ఛానళ్లు,రెండు స్ట్రీమింగ్‌ సేవలు ఉంటాయి.

    విలీనం అయిన సంస్థలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,అనుబంధ సంస్థలకు 63.16%వాటా ఉంటుంది. మిగతా 36.84%వాటా వాల్ట్‌ డిస్నీకి చెందుతుంది.

    సంయుక్త సంస్థకు నీతా అంబానీ నేతృత్వం వహిస్తారు.కాగా డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్‌ ఉదయ్‌ శంకర్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా ఉండనున్నారు.

    ఈ విలీనం ద్వారా రూ.70,000 కోట్ల విలువతో దేశంలోనే అతిపెద్ద మీడియా సామ్రాజ్యం ఏర్పడనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

    Jio AirFiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం: ముకేశ్ అంబానీ  తాజా వార్తలు
    రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా; డైరెక్టర్లుగా ఇషా, ఆకాశ్, అనంత్ నియామకం  ముకేష్ అంబానీ
    Mukesh Ambani: రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం: ముకేశ్ అంబానీకి బెదిరింపు  ముకేష్ అంబానీ
    Mukesh Ambani: ముకేష్ అంబానీకి మరో బెదిరింపు.. రూ.200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ మెయిల్  ముకేష్ అంబానీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025