
Speed Post: ఇకపై ఓటీపీ.. రిజిస్ట్రేషన్తోనే స్పీడ్ పోస్ట్ డెలివరీ.. పోస్టల్ శాఖ కీలక నిర్ణయాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్ల్యాండ్ స్పీడ్ పోస్ట్ (డాక్యుమెంట్) సేవలకు సంబంధించిన టారిఫ్ మార్పులు, కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు పోస్టల్ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ మార్పులు అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి రానున్నాయి. ఆగస్టు 1, 1986న ప్రారంభమైన స్పీడ్ పోస్ట్ సేవ దేశవ్యాప్తంగా వేగవంతమైన, నమ్మదగిన డెలివరీకి పేరుగాంచింది. ఇండియా పోస్ట్ ఆధునీకరణలో భాగంగా ప్రారంభించిన ఈ సేవ ప్రైవేట్ కొరియర్ సంస్థలకు గట్టి పోటీగా నిలుస్తోంది. స్పీడ్ పోస్ట్ టారిఫ్లను చివరిసారిగా 2012 అక్టోబర్లో సవరించారు. పెరుగుతున్న కార్యాచరణ ఖర్చులు, సాంకేతిక పరిజ్ఞానంలో పెట్టుబడులు అవసరమవుతున్న నేపథ్యంలో ఈసారి మార్పులు చేసినట్లు శాఖ తెలిపింది. అంతేకాక వినియోగదారుల సౌలభ్యం, విశ్వసనీయతను పెంచే విధంగా పలు కొత్త ఫీచర్లను కూడా జోడించింది.
Details
కొత్త ఫీచర్లు
రిజిస్ట్రేషన్ సర్వీస్ స్పీడ్ పోస్ట్ (డాక్యుమెంట్/పార్శిల్) కోసం రిజిస్ట్రేషన్ అందుబాటులోకి వచ్చింది. ఇది చిరునామాదారునికి లేదా అధీకృత ప్రతినిధికి మాత్రమే డెలివరీ అవుతుంది. ప్రతి వస్తువుకు రూ.5 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తారు. OTP ఆధారిత డెలివరీ చిరునామాదారుడు OTP ధృవీకరించిన తర్వాతే డెలివరీ ఇవ్వబడుతుంది. దీని కోసం ప్రతి వస్తువుకు రూ.5 ప్లస్ జీఎస్టీ ఖర్చవుతుంది. విద్యార్థులకు రాయితీ స్పీడ్ పోస్ట్ టారిఫ్పై విద్యార్థులకు 10% తగ్గింపు అందుబాటులో ఉంటుంది. SMS నోటిఫికేషన్లు వినియోగదారులకు SMS ద్వారా డెలివరీ స్థితి సమాచారం అందుతుంది.
Details
ఆన్లైన్ బుకింగ్
సులభమైన ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం వినియోగదారుల కోసం అందుబాటులో ఉంటుంది. రియల్ టైమ్ అప్డేట్స్ డెలివరీకి సంబంధించిన రియల్ టైమ్ ట్రాకింగ్ అప్డేట్స్ అందిస్తారు. అదనపు రిజిస్ట్రేషన్ సౌకర్యాలు వినియోగదారులకు మరిన్ని రిజిస్ట్రేషన్ ఎంపికలు కూడా అందుబాటులో ఉంటాయి.
Details
కొత్త టారిఫ్లు
50 గ్రాముల వరకు : స్థానిక దూరానికి రూ.19, అంతకంటే ఎక్కువ దూరాలకు రూ.47. 51 నుండి 250 గ్రాముల వరకు స్థానిక దూరానికి రూ.24 200 కి.మీ వరకు రూ.59 201-500 కి.మీ వరకు రూ.63 501-1000 కి.మీ వరకు రూ.68 1000 కి.మీ పైగా రూ.77
Details
251 నుండి 500 గ్రాముల వరకు
స్థానిక దూరానికి రూ.28 200 కి.మీ వరకు రూ.70 201-500 కి.మీ వరకు రూ.75 501-1000 కి.మీ వరకు రూ.82 1001-2000 కి.మీ వరకు రూ.86 2000 కి.మీ పైగా రూ.93 ఈ మార్పులతో వినియోగదారులకు ఆధునిక, నమ్మదగిన, పారదర్శకమైన సేవలను అందించడమే లక్ష్యమని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది.