LOADING...
Investment Tips: రోజుకు రూ.50 పెట్టండి… పిల్లలకు కోట్ల భవిష్యత్తు నిర్మించండి!
రోజుకు రూ.50 పెట్టండి… పిల్లలకు కోట్ల భవిష్యత్తు నిర్మించండి!

Investment Tips: రోజుకు రూ.50 పెట్టండి… పిల్లలకు కోట్ల భవిష్యత్తు నిర్మించండి!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2026
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో పొదుపు అలవాటు పెంపొందించేందుకు పలు సేవింగ్స్ పథకాలను ప్రవేశపెట్టింది. బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ఈ పథకాలలో ఎక్కువ వడ్డీ రేట్లు లభిస్తున్నాయి. వయస్సు,అవసరాల ఆధారంగా వేర్వేరు వర్గాలకు ప్రత్యేక పథకాలు అమలులో ఉన్నాయి. ఉద్యోగుల కోసం ప్రత్యేక సేవింగ్స్ స్కీమ్స్ ఉండగా, సీనియర్ సిటిజన్లు మరియు మహిళల కోసం ప్రత్యేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే చిన్నారుల భవిష్యత్తు కోసం డబ్బు కూడబెట్టాలనుకునే తల్లిదండ్రుల కోసం కూడా కేంద్రం అనేక పథకాలను తీసుకొచ్చింది. అందులో సుకన్య సమృద్ధి యోజనకు మంచి గుర్తింపు ఉంది. అదేవిధంగా ఎన్‌పీఎస్ వాత్సల్య అనే ప్రత్యేక పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది.

వివరాలు 

ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం అంటే ఏమిటి?

నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) విస్తరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించింది. కొన్ని వారాలు లేదా కొన్ని నెలల వయస్సు ఉన్న చిన్నారుల పేరుతో కూడా ఈ ఖాతాను తల్లిదండ్రులు ప్రారంభించవచ్చు. మైనర్ పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ ఖాతా తెరవడానికి అవకాశం కల్పించబడింది. చిన్నప్పటి నుంచే పిల్లల కోసం సేవింగ్స్ ప్రారంభిస్తే, వారు పెద్దయ్యే సరికి ఉన్నత విద్య లేదా ఇతర అవసరాలకు ఈ నిధులు ఉపయోగపడతాయి. అందువల్ల పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు ఇది మంచి ఎంపికగా భావించవచ్చు.

వివరాలు 

రోజుకు రూ.50 పెట్టుబడితో ఎంత లాభం?

ఉదాహరణకు, పిల్లవాడు ఏడాది వయస్సులో ఉన్నప్పటి నుంచే రోజుకు రూ.50 చొప్పున పెట్టుబడి పెడితే నెలకు రూ.1500 అవుతుంది. ఈ విధంగా 18 సంవత్సరాలు కొనసాగిస్తే, వారు 18 ఏళ్లు పూర్తి చేసే సమయానికి మొత్తం సొమ్ము సుమారు రూ.10 లక్షలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అదే పెట్టుబడిని 60 ఏళ్ల వయస్సు వరకు కొనసాగిస్తే, కార్పస్ సుమారు రూ.17.369 కోట్ల వరకు పెరగవచ్చు. పిల్లల వయస్సు పెరిగే కొద్దీ పెట్టుబడి మొత్తాన్ని కూడా పెంచితే, మరింత అధిక రాబడి పొందే అవకాశముంది.

Advertisement

వివరాలు 

అర్హతలు,ముఖ్యాంశాలు

ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14,2024న ప్రారంభించింది. 18సంవత్సరాల లోపు వయస్సు గల మైనర్ల కోసం ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులు ఖాతాను నిర్వహించాలి. కనీసంగా రూ.1,000తో ఖాతా ప్రారంభించాలి. సంవత్సరానికి కనీస పెట్టుబడి రూ.1,000నుంచి ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం గరిష్టంగా రూ.1.5లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(PFRDA)ఈ పథకాన్ని పర్యవేక్షిస్తుంది. ఈపథకంలో పెట్టుబడి చేసే మొత్తానికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. ఈ విధంగా ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన దీర్ఘకాలిక సేవింగ్స్ మార్గంగా ఉపయోగపడుతుంది.

Advertisement