Loading...
Oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. బ్యారెల్ చమురు ధర 120 డాలర్లకు చేరే అవకాశం!
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. బ్యారెల్ చమురు ధర 120 డాలర్లకు చేరే అవకాశం!

Oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. బ్యారెల్ చమురు ధర 120 డాలర్లకు చేరే అవకాశం!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, వరుసగా జరుగుతున్న నౌకలపై దాడులతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే బ్యారెల్‌కు 100 డాలర్ల స్థాయిని దాటిన చమురు ధరలు.. పరిస్థితులు మరింత తీవ్రతరం అయితే 120 డాలర్లకు చేరుకోవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిలో రాకపోకలకు అంతరాయం కొనసాగితే ధరలపై మరింత ఒత్తిడి పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

వివరాలు 

మే 22 తర్వాత అత్యధిక స్థాయిలో బ్రెంట్ ధర

ఇటీవల జరిగిన నౌకలపై దాడుల నేపథ్యంలో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా ఐదు ట్యాంకర్లను ముంచిన తర్వాత.. ప్రతీకార చర్యగా 10 నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది.

భవిష్యత్తులో మరిన్ని దాడులు జరిగితే తగిన విధంగా స్పందిస్తామని ఇరాన్ హెచ్చరించింది.

ఈ పరిణామాల మధ్య బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి బ్యారెల్‌కు 101.80 డాలర్లకు చేరాయి.

అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర 0.5 శాతం పెరిగి 96.55 డాలర్లకు చేరింది.

బ్రెంట్ ధర మే 22 తర్వాత అత్యధిక స్థాయిలో స్థిరపడటం.. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై మార్కెట్ స్పందనను తెలియజేస్తోంది.

వివరాలు 

హోర్ముజ్ జలసంధిలో తగ్గిన రాకపోకలు

హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు, సహజ వాయువు రవాణా ప్రస్తుతం యుద్ధానికి ముందు ఉన్న స్థాయితో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయింది.

ప్రపంచంలోని మొత్తం చమురు, గ్యాస్ సరఫరాల్లో దాదాపు ఐదో వంతు ఈ జలమార్గం ద్వారానే రవాణా అయ్యేది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రపంచ మార్కెట్‌లో సరఫరా ఆందోళనలు పెరిగాయి.

మధ్యప్రాచ్యంలో సరఫరా అంతరాయాలు, ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న చమురు నిల్వలను దృష్టిలో పెట్టుకుని అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (EIA) ఈ ఏడాది, వచ్చే ఏడాదికి చమురు ధరల అంచనాలను పెంచింది.

ADVERTISEMENT

వివరాలు 

సరఫరా కొరతతో పాటు భౌగోళిక రాజకీయ ప్రభావం

ప్రస్తుత చమురు ధరల పెరుగుదలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని కీసీఎం ట్రేడ్ చీఫ్ మార్కెట్ అనలిస్ట్ టిమ్ వాటెరర్ తెలిపారు.

ఒకవైపు మార్కెట్‌లో వాస్తవంగా సరఫరా కొరత ఏర్పడుతుండగా.. మరోవైపు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా అదనపు భద్రతా రిస్క్ ధరల్లో కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా నౌకలపై దాడులు, హోర్ముజ్ జలసంధిలో రవాణా పరిస్థితులు చమురు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

120 డాలర్లకు చేరొచ్చు: గోల్డ్‌మన్ సాక్స్

మధ్యప్రాచ్య నౌకలపై దాడులు మరింత పెరిగితే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాక్స్ హెచ్చరించింది.

అయితే చమురు ఎగుమతులు సాధారణ స్థితికి వస్తే ధరలు తిరిగి 80 డాలర్ల దిశగా తగ్గవచ్చని అంచనా వేసింది.

నౌకల రవాణాకు సంబంధించిన ప్రమాదాలు ప్రస్తుతం చమురు ధరలను ప్రభావితం చేస్తున్న ప్రధాన అంశాల్లో ఒకటిగా మారాయని గోల్డ్‌మన్ సాక్స్ గ్లోబల్ కమోడిటీస్ రీసెర్చ్ కో-హెడ్ డాన్ స్ట్రూవెన్ తెలిపారు.

ముడి చమురు ధరల్లో మరింత పెరుగుదలకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

మూడు నెలల అంతరాయమైతే 114 డాలర్లు: జేపీ మోర్గాన్

హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాలో అంతరాయం కొనసాగితే ప్రతి అదనపు నెలకు బ్రెంట్ చమురు ధర బ్యారెల్‌కు మరో 7-8 డాలర్లు పెరిగే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది.

ఈ అంతరాయం మూడు నెలల పాటు కొనసాగితే.. బ్రెంట్ చమురు సగటు నెలవారీ ధర సుమారు 114 డాలర్లకు చేరుకోవచ్చని తెలిపింది.

మరోవైపు సిటీ సంస్థ కూడా మూడో త్రైమాసికంలో బ్రెంట్ క్రూడ్ సగటు ధర అంచనాను 80 డాలర్ల నుంచి 86 డాలర్లకు పెంచింది.

హోర్ముజ్ జలసంధి తిరిగి సాధారణ స్థితికి రావడానికి అంచనా వేసిన దానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని సిటీ పేర్కొంది.

ADVERTISEMENT