
Budget 2025 : మహిళలకు వ్యాపార రంగంలో అవకాశాలు.. రూ. 2కోట్ల లోన్ పథకం ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కేంద్ర బడ్జెట్లో మహిళలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది.
2025-26 కేంద్ర బడ్జెట్లో భాగంగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కోసం సరికొత్త స్కీమ్ ప్రవేశపెట్టాలని ప్రకటించారు. ఈ కొత్త పథకం ద్వారా, షెడ్యూల్డ్ కులాల మహిళలకు సులభంగా రుణాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం రూ.2 కోట్ల వరకు టర్మ్ లోన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాల మహిళా పారిశ్రామిక వేత్తలకు రుణాలు అందించనున్నారు.
మొదటిసారిగా సొంత వ్యాపారాలు ప్రారంభించే మహిళలకు ఈ పథకం కింద ఐదేళ్లలో రూ.2 కోట్ల వరకు రుణాలు అందించనున్నారు.
Details
ఎస్పీ, ఎస్టీ వర్గాలకు ఉద్యోగ అవకాశాలు
ఈ పథకం ద్వారా మొత్తం 5 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలగనుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మహిళలు, ఎస్పీ, ఎస్టీ వర్గాలకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని నిర్మలమ్మ పేర్కొన్నారు.
ఈ స్కీమ్ కేవలం ఎస్సీ, ఎస్టీ మహిళలకు వర్తిస్తుందని, స్టాండప్ ఇండియా స్కీమ్ ద్వారా శిక్షణ తీసుకున్న వారికి కూడా ఈ పథకంలో చేరే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
పథకం కింద ఆన్లైన్ బిజినెస్ ప్రోత్సహించే పద్ధతులు, నిర్వాహక నైపుణ్యాల అభివృద్ధి కోసం వర్క్షాప్లను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ పథకం ఆర్థిక మద్దతుతో పాటు, వ్యవస్థాపక, నిర్వాహక నైపుణ్యాలను పెంచేందుకు, ఆన్లైన్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా అందించనున్నారు.