NITI Aayog: నీతీ ఆయోగ్లో కొత్త సభ్యులైన.. జోరం అనియా, బాలసుబ్రహ్మణ్యం ఎవరు..?
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్లో కీలక మార్పులు చేసింది. జోరం అనియా, ఆర్ బాలసుబ్రహ్మణ్యంలను ఫుల్టైమ్ సభ్యులుగా నియమించింది. దీంతో సభ్యుల సంఖ్య ఉపాధ్యక్షుడితో కలిపి ఏడుకి చేరింది.ఈ సంస్థకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఛైర్మన్గా ఉన్నారు. కేబినెట్ సెక్రటేరియట్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం,బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నియామకాలు అమల్లో ఉంటాయి. జోరామ్ అనియా ఎవరు? జోరం అనియా అనుభవజ్ఞురాలైన అకడమిషియన్,అసోసియేట్ ప్రొఫెసర్.అరుణాచల్ ప్రదేశ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ రెగ్యులేటరీ కమిషన్ సభ్యురాలిగా కూడా ఉన్నారు. బోధన, పరిశోధన, పబ్లిక్ పాలసీ రంగాల్లో 18 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. న్యిషి కమ్యూనిటీ నుంచి పీహెచ్డీ సాధించిన తొలి మహిళగా గుర్తింపు పొందారు.
వివరాలు
R. బాలసుబ్రమణియం ఎవరు?
సాహిత్యం, సంస్కృతి, స్థానిక జ్ఞాన వ్యవస్థలపై ఆమె చేసిన కృషి విశేషం. ఇక ఆర్ బాలసుబ్రహ్మణ్యం పబ్లిక్ పాలసీ నిపుణుడు, అభివృద్ధి కార్యకర్త. స్వామి వివేకానంద యూత్ మూమెంట్, గ్రాస్రూట్స్ రీసెర్చ్ అండ్ అడ్వకసీ మూమెంట్ సంస్థలను స్థాపించారు. పాలన సంస్కరణలు, సంస్థల బలోపేతం వంటి అంశాల్లో ప్రభుత్వాలకు సలహాలు ఇచ్చారు. ఈ నియామకాలతో దేశ విధాన రూపకల్పన మరింత బలోపేతం అవుతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఇద్దరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే, ఇటీవల నీతీ ఆయోగ్ పునర్వ్యవస్థీకరణలో అశోక్ కుమార్ లహిరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అలాగే కేవీ రాజు, ఎం శ్రీనివాస్, అభయ్ కరందికర్, గోబర్ధన్ దాస్, రాజీవ్ గౌబా వంటి ప్రముఖులు కూడా ఫుల్టైమ్ సభ్యులుగా నియమితులయ్యారు.