Railways: రైల్వే కొత్త నిబంధన.. ప్రయాణించేటప్పుడు ఒరిజినల్ ఐడీ లేకుండా రైలెక్కితే..
దేశంలో అత్యధికంగా ఉపయోగించే రవాణా విధానం రైల్వేలు. ప్రతి రోజు వేలాది రైళ్లతో లక్షలాది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, కన్ఫర్మ్డ్ టిక్కెట్లతో ప్రయాణించే వారికి, ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి భారతీయ రైల్వే ఒక కొత్త మార్గదర్శకం జారీ చేసింది. మీరు ఆన్లైన్లో (ఈ-టికెట్) టిక్కెట్లు బుక్ చేసుకున్నపుడు, ప్రయాణ సమయంలో ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇలాంటి ఐడీ లేకుండా రైలు ప్రయాణం చేసేటప్పుడు, టిక్కెట్ తనిఖీ చేసే టీటీఈ, మీరు టిక్కెట్టు లేని ప్రయాణికుడిగా పరిగణించి, జరిమానా విధించవచ్చు. అలాగే, మీ టిక్కెట్ను రద్దు చేసి, రైలు నుండి మిమ్మల్ని దించేయవచ్చు.
అంగీకరించే ఐడీ ప్రూఫ్లు ఇవే..
ఆధార్ కార్డు పాస్పోర్టు ఓటరు గుర్తింపు కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు ఫోటోతో కూడిన ప్రభుత్వ జారీ చేసిన ఇతర ఏదైనా ఐడీ ప్రయాణికులు ఈ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్లలో ఏదో ఒకటి తమతో తీసుకెళ్లాలి. రైల్వేలు ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప ఫోటోకాపీలు లేదా డిజిటల్ ఐడీలు అంగీకరించబడవు. ఒరిజినల్ ఐడీ లేకపోతే, మీ ఈ-టికెట్ను చెల్లనిదిగా పరిగణించి, టీటీఈ జరిమానా విధిస్తుంది. మీకు కేటాయించిన సీటును రద్దు చేయవచ్చు. ఏసీ తరగతుల్లో ఈ జరిమానా టిక్కెట్ ధరతో పాటు రూ.440 ఉంటుంది, స్లీపర్ క్లాస్లో అయితే టిక్కెట్ ధరతో పాటు రూ.220 జరిమానా ఉంటుంది. జరిమానా చెల్లించినప్పటికీ, మళ్లీ కేటాయింపు ఉండదు.