
Repo Rate: రెపోరేటు.. ఈసారి 50 బేసిస్ పాయింట్లు రేటు తగ్గించాలి: ఆర్థిక నిపుణులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థిక వ్యవస్థను మళ్లీ ఉత్సాహపరచేందుకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ ఏడాది ఫిబ్రవరిలో కీలక రేట్లను తగ్గించనున్నట్లు ప్రకటించింది.
గత ఐదేళ్లలో ఇదే మొదటిసారి. ఇప్పుడు మరోసారి కేంద్ర బ్యాంకు పరపతి విధాన కమిటీ (MPC) సమీక్ష నిర్వహించనుంది.
ఈసారి కూడా వడ్డీ రేట్ల తగ్గింపు ఉండొచ్చన్న అంచనాలు కనిపిస్తున్నాయి.
అయితే, ఎంత మేరకు తగ్గించనున్నారు? అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రెపో రేటు (Repo Rate) 50 బేసిస్ పాయింట్లు తగ్గితే మేలని కొందరు ఆర్థిక నిపుణుల అభిప్రాయం.
వివరాలు
అంతర్జాతీయ ప్రభావం
''అమెరికా ఫెడరల్ రిజర్వ్ గతేడాది సెప్టెంబరు నుంచి వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. కానీ భారతదేశంలో రెపో రేటు కేవలం 25 బేసిస్ పాయింట్లు మాత్రమే తగ్గింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది, బ్యాంకుల ద్రవ్యలోటు మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చేలా వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించడం అవసరమని'' పిరామల్ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ దేబోపమ్ చౌధరీ అభిప్రాయపడ్డారు. అయితే, ఏప్రిల్ సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశాలున్నాయని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
ఏడాది చివరి నాటికి 5.5%
ప్రస్తుతం రెపో రేటు 6.25%గా ఉంది. ఈ ఏడాది చివరికి దీనిని 5.5%కి తగ్గించే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా గ్లోబల్ రీసెర్చ్ అధ్యయనం వెల్లడించింది. ఏప్రిల్తో పాటు జూన్, అక్టోబరు సమీక్షలలో కూడా RBI 0.25% చొప్పున వడ్డీ రేట్లను తగ్గించవచ్చని అంచనా. రానున్న కొన్ని నెలలపాటు రిటైల్ ద్రవ్యోల్బణం 4% దిగువన కొనసాగే అవకాశముందని ఈ అధ్యయనం పేర్కొంది.
RBI సమీక్ష ఎప్పుడంటే?
ఏప్రిల్ 7-9 మధ్య ఆర్బీఐ ద్వైపాక్షిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరగనుంది. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఏప్రిల్ 9న ఆర్ బి ఐ గవర్నర్ ప్రకటించనున్నారు.