Loading...
RBI: ఆర్‌బీఐ బంగారు నిల్వలు 880 టన్నులు.. నికర ఎఫ్‌డీఐ భారీగా తగ్గినట్లు కేంద్రం వెల్లడి
నికర ఎఫ్‌డీఐ భారీగా తగ్గినట్లు కేంద్రం వెల్లడి

RBI: ఆర్‌బీఐ బంగారు నిల్వలు 880 టన్నులు.. నికర ఎఫ్‌డీఐ భారీగా తగ్గినట్లు కేంద్రం వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2026
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) వద్ద 2026 మార్చి 31 నాటికి మొత్తం 880.52 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధ్రీ రాజ్యసభలో వెల్లడించారు. 2025 మార్చి 31తో పోలిస్తే ఈ కాలంలో బంగారు నిల్వలు కేవలం 0.94 టన్నులు మాత్రమే పెరిగాయని తెలిపారు. గత రెండేళ్లతో పోలిస్తే ఇదే అత్యల్ప వృద్ధి అని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

లాభాల ఉపసంహరణతో నికర ఎఫ్‌డీఐ తగ్గుదల

ఇటీవలి కాలంలో దేశంలోకి వచ్చే నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(Net FDI)తగ్గడానికి విదేశీ పెట్టుబడిదారులు తమ లాభాలను వెనక్కి తీసుకెళ్లడం,అలాగే ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్(ODI) రూపంలో నిధులు విదేశాలకు వెళ్లడమే ప్రధాన కారణమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో 27.99బిలియన్ డాలర్లు ఉన్న నికర ఎఫ్‌డీఐలు, 2025-26 నాటికి 6.95 బిలియన్ డాలర్లకు (ఆ కాలం మారకపు విలువ ప్రకారం సుమారు రూ.62,550 కోట్లు) పడిపోయినట్లు మంత్రి వెల్లడించారు.

2023-24లో ఇవి 10.13బిలియన్ డాలర్లు,2024-25లో 960 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని చెప్పారు.

అయితే స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా చూస్తే 2025-26లో 94.84బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు భారత్‌కు వచ్చాయని,అంతకుముందు 2024-25లో ఈ మొత్తం 80.61బిలియన్ డాలర్లుగా ఉందని వివరించారు.

వివరాలు 

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ తగ్గుదల

భారతీయ కంపెనీలు విదేశాల్లో తమ వ్యాపారాలను విస్తరించేందుకు అవకాశం కల్పించే ఉద్దేశంతో 2022లో ఓడీఐ నిబంధనలను సరళీకరించడం వల్ల విదేశాలకు పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని మంత్రి పేర్కొన్నారు.

అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి నెలవారీ సగటు మారకపు విలువలో గణనీయమైన మార్పు నమోదైంది.

2014 మేలో ఒక డాలర్‌కు రూ.59.3గా ఉన్న మారకపు విలువ, 2026 మే నాటికి రూ.95.6కు చేరిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు 

కనీస నిల్వ లేకపోతే వేల కోట్ల వసూళ్లు

కరెంట్, సేవింగ్స్ ఖాతాల్లో నిర్దేశించిన కనీస సగటు నిల్వ నిర్వహించని ఖాతాదారుల నుంచి 2025-26లో ప్రైవేట్ రంగ బ్యాంకులు రూ.4,948.71 కోట్లు వసూలు చేసినట్లు రాజ్యసభలో వెల్లడైంది.

ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ రూపంలో రూ.2,137.92 కోట్లు వసూలు చేశాయి.

ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధికంగా రూ.1,798.14 కోట్లు వసూలు చేయగా, యాక్సిస్ బ్యాంక్ రూ.1,081.33 కోట్లు వసూలు చేసి రెండో స్థానంలో నిలిచింది.

ADVERTISEMENT

వివరాలు 

రూ.75 వేల కోట్ల ఐటీసీ మోసం

2025-26లో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)ను తప్పుడు విధానాల్లో క్లెయిమ్ చేయడం ద్వారా రూ.75,000 కోట్ల మేర మోసం జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈ వ్యవహారానికి సంబంధించి 30,162 కేసులు నమోదయ్యాయని, వీటిలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో నమోదైనట్లు మంత్రి తెలిపారు.

దిగుమతుల అవసరాలే వాణిజ్య లోటుకు కారణం

దేశంలో పెరుగుతున్న వస్తు వాణిజ్య లోటును ప్రతికూలంగా కాకుండా, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు అవసరమైన దిగుమతుల ప్రతిబింబంగా చూడాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

అలాగే ప్రతిపాదిత కస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ (CIC) అమలుకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించినట్లు రాజ్యసభకు వెల్లడించింది.

ADVERTISEMENT