NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / RBI: రెపో రేటు యథాతదం.. వృద్ధిరేటు అంచనాల పెంపు
    తదుపరి వార్తా కథనం
    RBI: రెపో రేటు యథాతదం.. వృద్ధిరేటు అంచనాల పెంపు
    RBI: రెపో రేటు యథాతదం.. వృద్ధిరేటు అంచనాల పెంపు

    RBI: రెపో రేటు యథాతదం.. వృద్ధిరేటు అంచనాల పెంపు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 08, 2023
    11:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) కీలకమైన రుణ రేటును యథాతథంగా ఉంచుతున్నట్లు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం తెలిపారు.

    దింతో రెపోరేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగనుంది. గత నాలుగు ద్వైమాసిక ద్రవ్య విధానాలలో కీలకమైన రుణ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.

    ద్రవ్యపరపతి విధాన (RBI Monetary Policy) కమిటీ సమావేశం బుధవారం ప్రారంభమైంది.

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం నాడు ఆరుగురు సభ్యుల MPC (monetary policy committee) ద్వైమాసిక ద్రవ్య విధానానికి సంబంధించిన నిర్ణయాలను వెల్లడించారు.

    Details 

    2023-'24 GDP 7%గా అంచనా : శక్తికాంత దాస్  

    RBI చివరిసారిగా ఫిబ్రవరిలో రెపో రేటును 6.5%కి పెంచింది.

    మే 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గ్లోబల్ సప్లై చెయిన్‌లో ఏర్పడిన అంతరాయాల తర్వాత వడ్డీ రేట్ల పెంపు సైకిల్ ముగిసింది.

    గవర్నర్ శక్తికాంత దాస్‌ ప్రసంగంలోని కీలక అంశాలు:

    2023 సంవత్సరం చివరికి వస్తుండడంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

    భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందన్న ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయన్నారు.

    ద్రవ్యోల్బణం (Inflation) తగ్గుముఖం పడుతోందన్న ఆయన ఆహార ద్రవ్యోల్బణంలో మాత్రం రిస్క్‌ లో కొనసాగుతోందన్నారు.

    ప్రస్తుత సంవత్సరం (2023-'24) GDP వృద్ధి రేటు 6.5 నుండి 7%గా అంచనా వేసినట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.

    Details 

    విదేశీ మారక నిల్వలు 604 బిలియన్‌ డాలర్లు

    హాస్పిటల్స్ , ఎడ్యుకేషనల్ ఇంస్టిట్యూషన్స్ కు UPI చెల్లింపుల పరిమితిని ఆర్‌బీఐ రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచింది.

    రికరింగ్‌ చెల్లింపుల ఇ-మ్యాండేట్‌ పరిమితిని రూ.15 వేల నుంచి రూ.1 లక్షకు పెంచాలని నిర్ణయించింది.

    డిసెంబర్‌ 1 2023 నాటికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 604 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ

    తాజా

    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు! బీసీసీఐ
    IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!   బీసీసీఐ
    Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు హర్యానా
    IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్!  ఐపీఎల్

    ఆర్ బి ఐ

    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం
    ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ బిల్ గేట్స్
    HDFC బ్యాంక్ లో ఫిక్సడ్ డీపాజిట్ వడ్డీ రేట్ల వివరాలు బ్యాంక్
    స్మాల్ క్యాప్ స్టాక్స్ పతనమవుతుండడానికి కారణం ఆర్ధిక వ్యవస్థ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025