NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / RBI : 6 నెలలు దాటింది.. అయినా రూ.9700 కోట్ల విలువైన పెద్దనోట్లు రాలేదన్న ఆర్​బీఐ 
    తదుపరి వార్తా కథనం
    RBI : 6 నెలలు దాటింది.. అయినా రూ.9700 కోట్ల విలువైన పెద్దనోట్లు రాలేదన్న ఆర్​బీఐ 
    RBI : 6నెలలు దాటింది.. రూ.9700 కోట్ల విలువైన పెద్దనోట్లు రాలేదన్న ఆర్​బీఐ

    RBI : 6 నెలలు దాటింది.. అయినా రూ.9700 కోట్ల విలువైన పెద్దనోట్లు రాలేదన్న ఆర్​బీఐ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 01, 2023
    04:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో కరెన్సీ నోట్లపై ఆర్​బీఐ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రూ.2 వేల నోట్లను ఉపసంహరించి ఆరు నెలలు దాటిందని గుర్తు చేసింది.

    అయినప్పటికీ రూ.9700 కోట్ల విలువైన నోట్లు మాత్రం వెనక్కి రాలేదని వెల్లడించింది.

    చలామణీలో ఉన్న 97.26 శాతం రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు వచ్చేశాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రకటించేసింది.

    కానీ రూ.9,760 కోట్లు విలువైన నోట్లు ఇంకా చలామణిలోనే ఉన్నాయని పేర్కొంది. రూ.2 వేల నోటు ఇప్పటికీ లీగల్‌ టెండర్‌గా కొనసాగుతుందని ఆర్‌బీఐ మరోసారి స్పష్టం చేసింది.

    రూ.2 వేల విలువైన నోటును ఈ ఏడాదిలోని మే 19న ఆర్‌ బి ఐ ఉపసంహరించుకుంది.

    DETAILS

    ప్రాంతీయ కార్యాలయాల్లో మార్పిడి చేసుకోవచ్చు : రిజర్వ్ బ్యాంక్

    అయితే ఆర్‌బీఐ నిర్ణయం వెలువడే నాటికే రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉండటం కొసమెరుపు.

    బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి, డిపాజిట్‌కు తొలుత సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం ఇచ్చి అక్టోబర్‌7 వరకు గడువును పొడిగించింది.

    ఈ మేరకు నవంబర్‌ 30 నాటికి 97.26 శాతం నోట్లు వెనక్కి వచ్చాయన్న ఆర్​బీఐ ,రూ.2 వేల నోటు ఇంకా చెల్లుబాటు అవుతుందని, ప్రాంతీయ కార్యాలయాల వద్ద ఎక్స్ఛేంజీ/ డిపాజిట్‌ చేసుకోవచ్చని సూచించింది.నోట్లను పోస్టల్‌ శాఖ ద్వారానూ పోస్ట్ చేసుకోవచ్చని వివరించింది.

    Regional Offices :

    హైదరాబాద్‌, కాన్పూర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పూర్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, బేల్‌పుర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, ఛండీగడ్‌, చెన్నై, గువాహటి, జైపూర్‌, జమ్ము, దిల్లీ, పట్నా, తిరువనంతపురం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ

    తాజా

    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    ఆర్ బి ఐ

    #NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది ప్రకటన
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం
    ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ బిల్ గేట్స్
    HDFC బ్యాంక్ లో ఫిక్సడ్ డీపాజిట్ వడ్డీ రేట్ల వివరాలు బ్యాంక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025