NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / RBI: రూ.100, 200 నోట్లపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలు.. సెప్టెంబరు వరకూ డెడ్‌లైన్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    RBI: రూ.100, 200 నోట్లపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలు.. సెప్టెంబరు వరకూ డెడ్‌లైన్!
    రూ.100, 200 నోట్లపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలు.. సెప్టెంబరు వరకూ డెడ్‌లైన్!

    RBI: రూ.100, 200 నోట్లపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలు.. సెప్టెంబరు వరకూ డెడ్‌లైన్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 29, 2025
    11:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ), రూ.100, రూ.200 నోట్ల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేసింది.

    ప్రజలకు చిన్న డినామినేషన్ నోట్ల లభ్యత పెరగాలన్న ఉద్దేశంతో ఆర్బీఐ సోమవారం అన్ని బ్యాంకులకు, అలాగే వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు (WLAO) ప్రత్యేకంగా సర్క్యులర్ పంపించింది.

    ఏటీఎంలపై ఆర్బీఐ ఫోకస్

    బ్యాంకులు నిర్వహించే ఏటీఎంలతో పాటు, బ్యాంకింగ్ కాని సంస్థలు నిర్వహించే వైట్ లేబుల్ ఏటీఎంలు కూడా ఇకపై రూ.100 లేదా రూ.200 నోట్లు తప్పనిసరిగా అందించాలి.

    ఇది దశలవారీగా అమలు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. చిన్న డినామినేషన్ నోట్లు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.

    Details

     టైమ్‌లైన్ ఇలా ఉంటుంది

    సెప్టెంబర్ 30, 2025 నాటికి - కనీసం 75శాతం ఏటీఎంలలో ఒక్కటైనా క్యాసెట్ రూ.100 లేదా రూ.200 నోట్ల కోసం ఉండాలి.

    మార్చి 31, 2026 నాటికి - కనీసం 90శాతం ఏటీఎంలలో అలాంటి క్యాసెట్ తప్పనిసరిగా ఉండాలి.

    ఈ మార్గదర్శకాలు అమలులోకి వచ్చిన తర్వాత ప్రజలకు చిన్ననోట్ల అవసరం తీర్చడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు.

    రూ.100, రూ.200 నోట్లు ప్రజల నిత్యవసరాల లావాదేవీల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారన్న కారణంతో ఈ ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

    Details

     చిన్న నోట్లపై ఆర్బీఐ దృష్టి

    అంతేకాకుండా, అన్ని బ్యాంకులు ఈ మార్గదర్శకాలను పాటిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది.

    ఇది ప్రజలకు ఉపయోగకరమైన మార్గదర్శకమని, బ్యాంకులు వెంటనే ఈ అంశాన్ని అమలు చేయాలని ఆర్బీఐ సూచించింది.

    ఇలా చూస్తే, ఇకపై ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లు లభించకపోవడమనే సమస్యకు ముగింపు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ
    వ్యాపారం

    తాజా

    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    ఆర్ బి ఐ

    UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేసే వారికి శుభవార్త.. ఒకేసారి రూ.5 లక్షల వరకు పంపొచ్చు యూపీఐ
    RBI: వడ్డీ రేట్లలో మార్పు లేకుండానే.. ద్రవ్యోల్బణం, చమురు ధరలు! ఇండియా
    RBI: వరుసగా పదోసారి వడ్డీరేట్లు యథాతథం శక్తికాంత దాస్‌
    RBI MPC meet: డిజిటల్‌ పేమెంట్స్‌పై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. యూపీఐ లైట్‌ వ్యాలెట్‌ పరిమితి రూ.5వేలకు పెంపు  శక్తికాంత దాస్‌

    వ్యాపారం

    Financial Habits : ఈ 5 ఫైనాన్స్ టిప్స్ పాటించకపోతే.. 30 తర్వాత అప్పుల్లో కూరుకుపోవచ్చు! బిజినెస్
    Airtel: ఎయిర్‌ ఫైబర్‌ విస్తరణలో ఎయిర్‌టెల్‌ దూకుడు.. నోకియాతో కొత్త ఒప్పందం! ఎయిర్ టెల్
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. లాభ-నష్టాల మధ్య ఊగిసలాట స్టాక్ మార్కెట్
    Amazon:క్విక్‌ కామర్స్‌లోకి అమెజాన్‌.. ఇక నుంచి 10 నిమిషాల్లో కిరాణా, గృహోపకరణాలు అమెజాన్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025