Page Loader
Crop Loans: రైతులకు శుభవార్త చెప్పిన ఆర్‌బీఐ.. రైతుల సంక్షేమం కోసం కొత్త రుణ పథకాలు
రైతులకు శుభవార్త చెప్పిన ఆర్‌బీఐ.. రైతుల సంక్షేమం కోసం కొత్త రుణ పథకాలు

Crop Loans: రైతులకు శుభవార్త చెప్పిన ఆర్‌బీఐ.. రైతుల సంక్షేమం కోసం కొత్త రుణ పథకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2024
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్‌ బి ఐ రైతులకు మంచి శుభవార్త అందించింది.రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని,ఆర్‌బీఐ తాజాగా పలు కొత్త రుణ పథకాలను ప్రకటించింది. ఈ పథకాలు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందించడం ద్వారా రైతుల ఆర్థిక భద్రతను పెంచే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాయి. ముఖ్యంగా,క్రాప్ లోన్ పథకాలను సులభతరం చేయడం ద్వారా రైతులు పంటల సాగు కోసం అవసరమైన విత్తనాలు,పురుగుమందులు,ఇతర అవసరాలను తీర్చుకునే విధంగా సాయం అందించనున్నారు. ఇకపోతే, కేంద్ర ప్రభుత్వం జమానత లేకుండా క్రాప్ లోన్లను అందించడమే కాకుండా, వీటి పరిమితిని పెంచే చర్యలు చేపట్టింది. ప్రస్తుతం తాకట్టు లేకుండా ఇచ్చే క్రాప్ లోన్ల పరిమితి రూ. 1.6 లక్షల నుండి రూ. 2 లక్షలకు జనవరి 1, 2025 నుండి పెంచనున్నారు.

వివరాలు 

 రైతుల భారం తగ్గించడంలో కీలక పాత్ర

ఇక రైతులు పంటల నష్టాలు,వర్షపాతం లోపం,ధరల తగ్గుదల వంటి సమస్యలతో తమ పెట్టుబడులను తిరిగి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్డీరేట్ల భారంతో పాటు రుణాల చెల్లింపులో జాప్యంతో తీవ్రఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ సమస్యలు మరింత తీవ్రమవుతూ ఉండటంతో రైతుల మానసిక,ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. ఇలాంటి సమయంలో,ఆర్‌బీఐ నిర్ణయించిన ఈకొత్త చర్యలు రైతుల భారం తగ్గించి,వారి జీవనోపాధిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా రుణాల స్వీకరణను పెంచడం,బ్యాంకుల ద్వారా రైతులకు మరింత అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు రైతులసంక్షేమానికి మేలు చేస్తాయి. ఈ విధంగా,ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా,వ్యవసాయ రంగ అభివృద్ధికి దోహదం చేస్తాయని చెప్పవచ్చు.