NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / RIL AGM: ఈనెల 29న రిలయన్స్ ఏజీఎం.. ఈసారి అంబానీ ప్రకటనలు వీటిపైనేనా? 
    తదుపరి వార్తా కథనం
    RIL AGM: ఈనెల 29న రిలయన్స్ ఏజీఎం.. ఈసారి అంబానీ ప్రకటనలు వీటిపైనేనా? 
    ఈనెల 29న రిలయన్స్ ఏజీఎం.. ఈసారి అంబానీ ప్రకటనలు వీటిపైనేనా?

    RIL AGM: ఈనెల 29న రిలయన్స్ ఏజీఎం.. ఈసారి అంబానీ ప్రకటనలు వీటిపైనేనా? 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 27, 2024
    03:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిలయెన్స్ వార్షిక సాధారణ సమావేశం ప్రతేడాది జరుగుంది. 2016లో జియో లాంచ్ తర్వాత నుంచి ప్రతి ఏజీఎంలో కొత్త ప్రకటనలపై ఆసక్తి నెలకొంది.

    ఈ ఏడాది కూడా రిలయన్స్‌ 47వ వార్షిక సాధారణ సమావేశం ఆగస్ట్ 29న మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ ఈవెంట్‌ను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

    సుమారు 35 లక్షల మంది షేర్ హోల్డర్లను ఉద్ధేశించి ముకేష్ అంబానీ ప్రసంగించనున్నారు.

    ఈ ఏడాది ఏజీఎంలో ముకేశ్‌ అంబానీ వివిధ వ్యాపారాల ప్రగతి, భవిష్యత్‌ ప్రణాళికలను తెలియజేయనున్నారు.

    Details

    వారసత్వ ప్రణాళికలపై ప్రకటనలు వెలువడే అవకాశం

    రిలయన్స్‌ జియో, రిటైల్‌ వంటి విభాగాలు ఇటీవల కాలంలో మెరుగైన ప్రదర్శనతో ముందుకెళ్తున్నాయి.

    ఈ వ్యాపారాల లిస్టింగ్‌ గురించి ముకేశ్‌ 2019లోనే ప్రస్తావించారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనలు చేయలేదు.

    ఈసారి వాటిపై కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

    ముకేశ్‌ అంబానీ తన పిల్లలైన ఈశా, ఆకాశ్‌, అనంత్‌లకు వ్యాపార బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో వారసత్వ ప్రణాళికలపై కూడా ప్రకటనలు వెలువడే అవకాశాలున్నాయి.

    రిలయన్స్‌ న్యూ ఎనర్జీ బిజినెస్‌లో చేస్తున్న ప్రగతి, జామ్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న మెగా గ్రీన్‌ ఎనర్జీ కాంప్లెక్స్‌ గురించి అప్‌డేట్లు ఉండొచ్చని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు.

    Details

    కొత్త ప్రకటనలపై ఆసక్తి

    గత ఏజీఎంలలో రిలయన్స్‌ కొన్ని కీలకమైన ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. 2016లో జియో టెలికాం సేవలను ప్రారంభించారు.

    తర్వాత 2017లో జియో ఫోన్‌తో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు. 2019లో జియో ఫైబర్‌ను లాంచ్ చేయగా, 2021లో న్యూ ఎనర్జీ బిజినెస్‌ ప్రకటించారు.

    2022లో 5జీపై రూ.2లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. 2023లో జియో ఎయిర్‌ఫైబర్‌ గురించి కూడా వివరించారు.

    ఈ ఏడాది కూడా కొత్తగా ఏం ప్రకటిస్తారో వేచి చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముకేష్ అంబానీ
    రిలయెన్స్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ముకేష్ అంబానీ

    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు ఆటో మొబైల్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్

    రిలయెన్స్

    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు జియో
    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో జియో
    రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా, కాలింగ్ ప్రయోజనాలను తెలుసుకుందాం జియో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025