LOADING...
Nvidia: రూ.1.8 లక్షల కోట్ల డీల్‌.. గ్రోక్‌ ఏఐ ఆస్తులు ఎన్‌విడియా చేతికి
రూ.1.8 లక్షల కోట్ల డీల్‌.. గ్రోక్‌ ఏఐ ఆస్తులు ఎన్‌విడియా చేతికి

Nvidia: రూ.1.8 లక్షల కోట్ల డీల్‌.. గ్రోక్‌ ఏఐ ఆస్తులు ఎన్‌విడియా చేతికి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

అధునాతన ఏఐ కృత్రిమ మేధస్సు యాక్సిలరేటర్‌ చిప్‌ల రూపకల్పనలో పనిచేస్తున్న అంకుర సంస్థ గ్రోక్‌ నుంచి కీలక ఆస్తులను కొనుగోలు చేయాలని అమెరికా టెక్‌ దిగ్గజం ఎన్‌విడియా నిర్ణయించింది. ఈ ఒప్పందం ద్వారా తమ ఏఐ ఉత్పత్తులు మరింత బలోపేతం అవుతాయని ఎన్‌విడియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ జెన్సన్‌ హ్యువాంగ్‌ తెలిపారు. సుమారు 20 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.8 లక్షల కోట్లు) నగదు చెల్లింపుతో ఈ కొనుగోలు జరగనుందని ఆంగ్ల వార్తా సంస్థ సీఎన్‌బీసీ వెల్లడించింది. గ్రోక్‌ ఈ విక్రయానికి పెద్దగా ఆసక్తి చూపకపోయినా, ఒప్పందం మాత్రం వేగంగా కుదిరిందని డిస్ట్రప్టివ్‌ సీఈఓ అలెక్స్‌ డేవిస్‌ తెలిపారు. గ్రోక్‌లో డిస్ట్రప్టివ్‌కు 500 మిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

Details

750 మిలియన్ డాలర్ల నిధులు సమీకరణ

మూడు నెలల క్రితమే గ్రోక్‌ తన ఎంటర్‌ప్రైజ్‌ విలువను 6.9 బిలియన్‌ డాలర్లుగా నిర్ణయించి, 750 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. ఈ పెట్టుబడుల్లో బ్లాక్‌రాక్‌, శాంసంగ్‌, సిస్కో, ఆల్టిమీటర్‌తో పాటు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ భాగస్వామిగా ఉన్న 1789 క్యాపిటల్‌ సంస్థ కూడా పాల్గొంది. గ్రోక్‌కు చెందిన క్లౌడ్‌ వ్యాపారాన్ని మినహాయించి, మిగతా అన్ని కీలక ఆస్తులను ఎన్‌విడియా కొనుగోలు చేయనుందని అలెక్స్‌ డేవిస్‌ స్పష్టం చేశారు. ఎన్‌విడియా గతంలో చేపట్టిన అతిపెద్ద కొనుగోళ్లను పరిశీలిస్తే, 2019లో మెలనాక్స్‌ సంస్థను 7 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా గ్రోక్‌ ఒప్పందం, ఆ స్థాయిని మించి ఎన్‌విడియా చరిత్రలోనే అతిపెద్ద డీల్‌గా నిలవనుందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement