SEBI : సెబీ కొత్త నిర్ణయం: ట్రేడింగ్ యాప్లకు 'వెరిఫైడ్' లేబుల్.. మోసాలకు చెక్
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులను రక్షించడమే లక్ష్యంగా సెబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు గూగుల్ ప్లే స్టోర్లో లభ్యమయ్యే స్టాక్ ట్రేడింగ్ యాప్లకు 'వెరిఫైడ్' లేబుల్ను అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా సాధారణ పెట్టుబడిదారులు నిజమైన యాప్లు ఏవి, నకిలీ యాప్లు ఏవి అన్నది సులభంగా గుర్తించగలుగుతారు. దీంతో మోసాల నుంచి రక్షణ మరింత బలపడనుంది.
వివరాలు
పెరుగుతున్న సైబర్ మోసాలు
ఇటీవల కాలంలో ప్రముఖ బ్రోకరేజ్ కంపెనీల పేర్లు, లోగోలను కాపీ చేసి నకిలీ యాప్లు రూపొందించి పెట్టుబడిదారులను మోసం చేసే ఘటనలు గణనీయంగా పెరిగాయి. ఈ యాప్లు అసలు ప్లాట్ఫారమ్ల మాదిరిగానే కనిపిస్తూ, పెట్టుబడిదారుల డబ్బు సురక్షిత మార్కెట్లోనే పెట్టుబడి అవుతోందనే భావన కలిగిస్తాయి. కానీ వాస్తవానికి అది మోసం. ఇది ముఖ్యంగా చిన్న పెట్టుబడిదారులకు పెద్ద ప్రమాదంగా మారుతోంది అని సెబీ హెచ్చరించింది.
వివరాలు
గూగుల్తో సెబీ భాగస్వామ్యం
ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు సెబీ, Google తో కలిసి పని చేస్తోంది. సెబీ వద్ద రిజిస్టర్ అయిన సంస్థల యాప్లకే 'వెరిఫైడ్ బ్యాడ్జ్' ఇస్తారు. ఇప్పటివరకు 600కు పైగా ట్రేడింగ్ యాప్లు వెరిఫై అయ్యాయి. భవిష్యత్తులో ఇతర ఆర్థిక మధ్యవర్తుల యాప్లకు కూడా ఈ ఫీచర్ను విస్తరించనున్నారు దీంతో యూజర్లు నమ్మకమైన యాప్లను సులభంగా గుర్తించగలుగుతారు.
వివరాలు
ఫిన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు
సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే పెట్టుబడి సలహాలు ఇస్తున్న 'ఫిన్ఫ్లుయెన్సర్ల'పై కఠిన నిఘా అవసరమని చెప్పారు. దీనికోసం కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించాలని Google ను కోరినట్లు తెలిపారు. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న ఈ తరహా సమస్యలను అదుపులో పెట్టాలంటే ఆధునిక టెక్నాలజీని చట్టపరంగా వినియోగించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
పెట్టుబడిదారులు ఎలా మోసపోతున్నారు?
ప్రస్తుతం మోసగాళ్లు ఉపయోగిస్తున్న పద్ధతులు ఇలా ఉన్నాయి: సోషల్ మీడియా లేదా వాట్సాప్ ద్వారా అధిక లాభాల ఆశ చూపడం సెబీ రిజిస్టర్ బ్రోకర్లను పోలి ఉండే నకిలీ యాప్ లింక్ పంపించడం యాప్లో నకిలీ లాభాలు, గ్రాఫ్లు చూపించి నమ్మకం కల్పించడం పెట్టిన డబ్బు అసలు మార్కెట్కు కాకుండా మోసగాళ్ల ఖాతాలకు మళ్లించడం డబ్బు వెనక్కి తీసుకోవాలనుకునే సరికి స్కామర్లు మాయమవడం