Loading...
SEBI's New CAS Rule: సెబీ కొత్త CAS విధానం.. నిఫ్టీ, సెన్సెక్స్ మధ్య భారీ వ్యత్యాసానికి ఇదే కారణం
సెబీ కొత్త CAS విధానం.. నిఫ్టీ,సెన్సెక్స్ మధ్య భారీ వ్యత్యాసానికి ఇదే కారణం

SEBI's New CAS Rule: సెబీ కొత్త CAS విధానం.. నిఫ్టీ, సెన్సెక్స్ మధ్య భారీ వ్యత్యాసానికి ఇదే కారణం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ స్టాక్ మార్కెట్లలో ఒకే ట్రేడింగ్ రోజున బెంచ్‌మార్క్ సూచీలు భిన్నంగా కదలడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 సూచీ 390.70 పాయింట్లు (1.60 శాతం) ఎగబాకి 24,774.30 వద్ద ముగియగా.. బీఎస్ఈ సెన్సెక్స్ మాత్రం 544.39 పాయింట్లు (0.70 శాతం) మాత్రమే పెరిగి 78,639.03 వద్ద స్థిరపడింది. సాధారణ పరిస్థితుల్లో నిఫ్టీ, సెన్సెక్స్ దాదాపు ఒకే దిశలో కదులుతుంటాయి. అయితే ఈసారి ట్రేడింగ్ చివరి నిమిషాల్లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల నిఫ్టీ అనూహ్యంగా భారీ జంప్ నమోదు చేసింది. ఇది సాంకేతిక సమస్య కాదు. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (Closing Auction Session-CAS) విధానమే దీనికి ప్రధాన కారణం.

వివరాలు 

CAS విధానం ఎలా పనిచేస్తుంది?

డెరివేటివ్స్ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడింగ్‌కు అనుమతించిన షేర్ల ముగింపు ధరను మరింత పారదర్శకంగా నిర్ణయించేందుకు సెబీ ఈ కొత్త విధానాన్ని అమలు చేసింది.

పాత విధానం ఎలా ఉండేది?

ఇప్పటి వరకు ట్రేడింగ్ ముగిసే ముందు చివరి 30 నిమిషాల్లో నమోదైన లావాదేవీల వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ (VWAP) ఆధారంగా అధికారిక ముగింపు ధరను నిర్ణయించేవారు.

వివరాలు 

కొత్త CAS విధానంలో ఏమి మారింది?

కొత్త విధానం ప్రకారం మధ్యాహ్నం 3:15 గంటలకు సాధారణ ట్రేడింగ్ ముగుస్తుంది.

అనంతరం 3:15 నుంచి 3:35 గంటల వరకు ఆయా షేర్లకు సంబంధించిన అన్ని కొనుగోలు,అమ్మకాల ఆర్డర్లను ఒకే పూల్‌లో సేకరిస్తారు.

ఆ తర్వాత అత్యధిక లావాదేవీలు జరిగేలా అనువైన ఒకే ధరను (Single Price) సిస్టమ్ ఎంపిక చేస్తుంది.

అదే ఆ రోజు అధికారిక క్లోజింగ్ ధరగా పరిగణించబడుతుంది. ఇక డెరివేటివ్స్ ట్రేడింగ్ మాత్రం సాయంత్రం 3:40 గంటల వరకు కొనసాగుతుంది.

అనంతరం 3:50 నుంచి 4:00 గంటల వరకు జరిగే పోస్ట్-క్లోజ్ సెషన్‌లో కొత్తగా నిర్ణయించిన ముగింపు ధర వద్ద పెండింగ్ ఆర్డర్లను పూర్తి చేస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

సెబీ ఈ మార్పు ఎందుకు తీసుకొచ్చింది?

ఈ వేలం ప్రక్రియ మధ్యాహ్నం 3:00 నుంచి 3:15 గంటల మధ్య నమోదైన VWAP ఆధారంగా నిర్ణయించే రిఫరెన్స్ ధరకు ±3 శాతం పరిమితిలోనే నిర్వహించబడుతుంది.

ముగింపు ధరలను మరింత పారదర్శకంగా నిర్ణయించడం, ధరల మానిప్యులేషన్ అవకాశాలను తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రమాణాలకు భారత మార్కెట్‌ను దగ్గర చేయడం ఈ విధానం వెనుక సెబీ ప్రధాన లక్ష్యాలు.

అదేవిధంగా ఇండెక్స్ ఫండ్లలో కనిపించే ట్రాకింగ్ ఎర్రర్ తగ్గించడంతో పాటు, పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్లు భారీ పొజిషన్లను సురక్షితంగా క్లోజ్ చేసుకునేందుకు కూడా ఈ సింగిల్ ప్రైస్ విధానం ఉపయోగపడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

దేశంలో ప్రతిరోజూ నిర్వహించే 15 నిమిషాల ప్రీ-ఓపెన్ మార్కెట్ సెషన్ కూడా ఇదే తరహా విధానంలో పనిచేస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

మొదటి రోజే ఎందుకు గందరగోళం ఏర్పడింది?

మధ్యాహ్నం 3:15 గంటలకు CAS ప్రారంభానికి ముందు ఉన్న స్థాయితో పోలిస్తే నిఫ్టీ ఒక్కసారిగా సుమారు 0.8 శాతం పెరిగింది.

అయితే సెన్సెక్స్‌లో అలాంటి భారీ మార్పు కనిపించకపోవడంతో రెండు సూచీల మధ్య స్పష్టమైన వ్యత్యాసం నమోదైంది.

KKerdos Creators LLP ఫౌండింగ్ పార్టనర్ వైభవ్ సూద్ మాట్లాడుతూ, తొలి రోజు వేలం ప్రక్రియలో ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉండటంతో కొనుగోలు ఆర్డర్లు సూచీని వేగంగా పైకి నెట్టాయని తెలిపారు.

పాత విధానంలో ఇదే ఆర్డర్లు 30 నిమిషాల వ్యవధిలో విభజించబడేవి కాబట్టి ముగింపు ధరపై ప్రభావం అంతగా కనిపించేది కాదని వివరించారు.

వివరాలు 

ఎన్ఎస్ఈ ఏమి చెప్పింది?

ఈ పరిణామంపై స్పందించిన ఎన్ఎస్ఈ, కొత్త వ్యవస్థ పూర్తిగా నిర్దేశిత నిబంధనల ప్రకారమే పనిచేసిందని స్పష్టం చేసింది.

తొలి రోజు క్లోజింగ్ వేలంలో 515 మంది ట్రేడింగ్ సభ్యులు పాల్గొనగా, 50 వేలకుపైగా ఖాతాల నుంచి ఆర్డర్లు నమోదయ్యాయని తెలిపింది.

కాలక్రమేణా ఈ వ్యవస్థ మరింత స్థిరంగా పనిచేస్తుందని కూడా వెల్లడించింది.

వివరాలు 

మంగళవారం మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది?

సోమవారం చివరి నిమిషంలో కనిపించిన అసాధారణ ర్యాలీ తాత్కాలికమేనని మార్కెట్ నిపుణులు ముందుగానే అంచనా వేశారు.

అదే విధంగా మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.

నిఫ్టీ 0.58 శాతం తగ్గి 24,629.70 వద్దకు చేరగా, సెన్సెక్స్ మాత్రం 0.26 శాతం లాభపడి 78,842.70 వద్ద ట్రేడయ్యింది.

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ మాట్లాడుతూ, తొలి రోజు కనిపించిన ఈ వ్యత్యాసం ప్రత్యేక పరిస్థితుల వల్ల మాత్రమే ఏర్పడిందని, దీని గురించి ఇన్వెస్టర్లు అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

వివరాలు 

ఇప్పుడు అందరి దృష్టి వారపు ఎక్స్‌పైరీపైనే..

కొత్త CAS విధానానికి అసలైన పరీక్ష వీక్లీ డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ రోజునే ఎదురుకానుంది.

ఆ రోజు భారీ స్థాయిలో పొజిషన్లు క్లోజ్ అయ్యే అవకాశం ఉండటంతో, మార్కెట్‌లో అధిక ట్రేడింగ్ ఒత్తిడిని ఈ కొత్త క్లోజింగ్ వ్యవస్థ ఎంత సమర్థంగా నిర్వహిస్తుందో చూడాల్సి ఉంది.

ADVERTISEMENT