LOADING...
Stock market: ఆటో, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
ఆటో, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

Stock market: ఆటో, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2025
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో పాటు, సూచీలను ముందుకు నడిపించే స్పష్టమైన సానుకూల అంశాలేమీ లేకపోవడంతో విక్రయ ఒత్తిడి కొనసాగింది. ముఖ్యంగా ఐటీ, ఆటో రంగ స్టాక్స్‌లో అమ్మకాలు పెరగడం వల్ల సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఏడాది చివరి దశకు చేరుకోవడంతో ట్రేడింగ్ యాక్టివిటీ కూడా పరిమితంగానే నమోదైంది. ఈ పరిస్థితుల్లో బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ సుమారు రూ.1 లక్ష కోట్లు క్షీణించి రూ.474 లక్షల కోట్లకు పరిమితమైంది.

Details

సూచీల కదలిక

సెన్సెక్స్‌ ఉదయం 85,225.28 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 85,408.70) నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నెగెటివ్‌ ట్రెండ్‌లోనే కొనసాగిన సూచీ, ఇంట్రాడేలో 84,937.82 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 367.25 పాయింట్ల నష్టంతో 85,041.45 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా నష్టాల బాటలోనే సాగి, 99.80 పాయింట్లు తగ్గి 26,042.30 వద్ద ముగిసింది. ఇదే సమయంలో డాలరుతో రూపాయి మారకం విలువ 89.86గా నమోదైంది.

Details

లాభనష్టాల్లో షేర్లు

సెన్సెక్స్‌ 30 సూచీలో భాగమైన కంపెనీలలో బజాజ్ ఫైనాన్స్‌, ఏషియన్ పెయింట్స్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, ఎటెర్నల్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. మరోవైపు టైటాన్‌, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, రిలయన్స్ షేర్లు లాభాల బాట పట్టాయి.

Advertisement

Details

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి

అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 62.31 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో బంగారం ఔన్సు ధర 4,517 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మొత్తంగా గ్లోబల్ మార్కెట్ల నుంచి స్పష్టమైన సంకేతాలు లేకపోవడం, సంవత్సరాంతం నేపథ్యంలో పెట్టుబడిదారుల అప్రమత్తత కారణంగా దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement