Stock Market : అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో మార్కెట్లు కుదేలు.. 172 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో ఉదయం స్వల్ప లాభాల్లో కదలాడిన సూచీలు చివరికి నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్యూ) షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. జూన్లో కుదిరిన ఒప్పందం గడువు ముగియడంతో అమెరికా.. ఇరాన్పై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మదుపర్ల సెంటిమెంట్పైనా ప్రభావం చూపించాయి.
వివరాలు
సెన్సెక్స్ 172 పాయింట్లు డౌన్
బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 77,629.56 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది.
గత ముగింపు 77,540.83 పాయింట్లతో పోలిస్తే ప్రారంభంలో సూచీ 88.73 పాయింట్ల లాభంలో ఉంది.
అయితే, కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడి పెరగడంతో నష్టాల్లోకి జారుకుంది.
ఇంట్రాడేలో 77,201.66 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరికి 171.72 పాయింట్లు కోల్పోయి 77,369.11 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ కూడా నష్టాల్లోనే
ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా నష్టాలతో ముగిసింది. సూచీ 32.95 పాయింట్లు తగ్గి 24,219.05 వద్ద స్థిరపడింది.
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాసియా పరిణామాలపై మదుపర్ల ఆందోళనలు మార్కెట్పై ఒత్తిడిని పెంచాయి.
వివరాలు
ఈ షేర్లకు నష్టాలు.. ఆ షేర్లకు లాభాలు
సెన్సెక్స్ 30లో అదానీ పోర్ట్స్, బీఈఎల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.
మరోవైపు టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి.
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.74గా నమోదైంది.
అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 92.73 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు బంగారం ఔన్సు 4,646 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.