Loading...
Stock market: ఏడో రోజూ నష్టాల్లో నిఫ్టీ.. 24,100 దిగువకు జారిన సూచీ
ఏడో రోజూ నష్టాల్లో నిఫ్టీ.. 24,100 దిగువకు జారిన సూచీ

Stock market: ఏడో రోజూ నష్టాల్లో నిఫ్టీ.. 24,100 దిగువకు జారిన సూచీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో పాటు ఇతర ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. దీంతో నిఫ్టీ వరుసగా ఏడో సెషన్‌లోనూ నష్టాలను చవిచూసింది. 24,100 స్థాయిని కోల్పోయి 24,078 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. క్రితం సెషన్‌లో 77,235.46 పాయింట్ల వద్ద ముగిసిన ఈ సూచీ.. బుధవారం 77,218.05 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత రోజంతా నష్టాల బాటలోనే కదలాడింది. ఒక దశలో 76,822.89 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. చివరికి 325.78 పాయింట్లు నష్టపోయి 76,909.68 వద్ద స్థిరపడింది.

vivaralu

బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 91 డాలర్లు 

మరోవైపు నిఫ్టీ కూడా నష్టాలతోనే ముగిసింది. సూచీ 76.60 పాయింట్లు కోల్పోయి 24,078 వద్ద స్థిరపడింది.

దీంతో వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగిసినట్లయింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.75గా నమోదైంది. సెన్సెక్స్‌ 30లోని ప్రధాన షేర్లలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ నష్టాలతో ముగిశాయి.

మరోవైపు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎటర్నల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, సన్‌ఫార్మా, టైటాన్‌ షేర్లు లాభాలను నమోదు చేశాయి.

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌ను పరిశీలిస్తే బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 91 డాలర్ల స్థాయికి చేరింది. మరోవైపు బంగారం ధర ఔన్సుకు 4,368 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ADVERTISEMENT