Loading...
IND Vs SL: వరుణుడి దయ ఉంటేనే.. భారత్‌ విజయం
వరుణుడి దయ ఉంటేనే.. భారత్‌ విజయం

IND Vs SL: వరుణుడి దయ ఉంటేనే.. భారత్‌ విజయం

వ్రాసిన వారు Moogati Shabari
Aug 19, 2026
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంక పర్యటనను విజయంతో ప్రారంభించేందుకు టీమిండియా సిద్ధమైంది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే ఆధిక్యం సాధించే అవకాశం భారత జట్టు ముందుంది. అయితే ఈ విజయానికి ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా వర్షం మారింది. మ్యాచ్‌ మొదలైనప్పటి నుంచి గాలె టెస్టును పదేపదే వర్షం ఇబ్బంది పెడుతుండగా.. చివరి రోజైన ఐదో రోజున కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కనీసం సగం రోజు ఆట సాధ్యమైనా శ్రీలంకను ఓటమి నుంచి కాపాడుకోవడం కష్టమే. భారత్‌ నిర్దేశించిన 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఇప్పటికే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.

వివరాలు

47 పరుగులకే నాలుగు వికెట్లు..

లక్ష్య ఛేదనలో శ్రీలంకకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి.

47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది.

తొలి ఇన్నింగ్స్‌లోనూ మంచి ప్రదర్శన చేసిన భారత పేసర్‌ సిరాజ్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఓపెనర్‌ నిషాన్‌ మదుష్క (6)ను త్వరగానే పెవిలియన్‌కు పంపించాడు.

ఆ తర్వాత యువ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ తన అద్భుత బౌలింగ్‌ను కొనసాగించాడు.

లహిరు ఉదార (16), పసిందు సూర్యబండార (0)లను అతడు ఔట్‌ చేసి శ్రీలంకను మరింత కష్టాల్లోకి నెట్టాడు.

ఆ తర్వాత లంక వైస్‌ కెప్టెన్‌ కమిందు మెండిస్‌ (2)ను ప్రసిద్ధ్‌ కృష్ణ బౌల్డ్‌ చేయడంతో ఆ జట్టు 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. మానవ్‌ సుతార్‌ 2/30తో రాణించాడు.

వివరాలు`

ఆదుకున్న కెప్టెన్‌, సెంచరీ హీరో

ఈ దశలో శ్రీలంక కెప్టెన్‌ ధనంజయ డిసిల్వా, తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన సోనాల్‌ దినుష జట్టును ఆదుకున్నారు.

ఇద్దరూ సుమారు గంటపాటు ఎంతో జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేసి మరో వికెట్‌ పడకుండా చూశారు.

ఆట ముగిసే సమయానికి ధనంజయ 31 పరుగులతో, దినుష 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఈ జోడీ ఐదో వికెట్‌కు అజేయంగా 37 పరుగులు జోడించింది. దీంతో శ్రీలంక నాలుగో రోజు ఆటను 4 వికెట్లకు 84 పరుగుల వద్ద ముగించింది.

అయినప్పటికీ 372 పరుగుల భారీ లక్ష్యం ముందు ఆతిథ్య జట్టు ఇంకా ఓటమి ముంగిటే ఉంది.

ADVERTISEMENT

వివరాలు

193 పరుగులకే భారత్‌ ఆలౌట్

అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 193 పరుగులకే తన ఇన్నింగ్స్‌ను ముగించింది.

తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు చేసిన టీమ్‌ఇండియా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

మ్యాచ్‌లో ప్రతి రోజూ వర్షం ఆటకు అంతరాయం కలిగిస్తుండటంతో వీలైనంత వేగంగా పరుగులు చేసి శ్రీలంకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని భారత్‌ భావించింది.

అయితే వేగంగా ఆడే ప్రయత్నంలో భారత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. ఫలితంగా 200 పరుగుల మార్కును కూడా చేరకముందే జట్టు ఆలౌటైంది.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించగానే యశస్వి జైస్వాల్‌ను అసిత ఫెర్నాండో డకౌట్‌ చేశాడు.

ADVERTISEMENT

వివరాలు

తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదిన దేవ్‌దత్‌ పడిక్కల్‌..

అయితే మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (35; 47 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ (44; 75 బంతుల్లో 6 ఫోర్లు) కలిసి రెండో వికెట్‌కు 64 పరుగులు జోడించారు.

దీంతో భారత ఇన్నింగ్స్‌ కొంత కుదుటపడింది. అయితే ఈ భాగస్వామ్యం విడిపోయిన తర్వాత టీమ్‌ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది.

కేఎల్‌ రాహుల్‌తో పాటు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (8)ను ప్రభాత్‌ జయసూర్య పెవిలియన్‌కు పంపాడు.

దీంతో 65/1గా ఉన్న భారత్‌ కాసేపటికే 81/3కు చేరుకుంది. అర్ధశతకం దిశగా సాగుతున్న పడిక్కల్‌ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు.

ధ్రువ్‌ జురెల్‌ (7) కూడా స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యాడు. దీంతో భారత స్కోరు 120/5కు పడిపోయింది.

ADVERTISEMENT