
Stock Market: నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ, మన సూచీలు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం నూతన హెచ్1బీ వీసా దరఖాస్తులపై ఐటీ కంపెనీలకు లక్ష డాలర్ల (సుమారు రూ.88 లక్షల) చెల్లింపులు విధించాలని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, ఐటీ రంగంలోని షేర్లపై ఒత్తిడి పెరిగింది. ఉదయం 9.31 గంటల వరకు సెన్సెక్స్ 149 పాయింట్ల నష్టంతో 82,476 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 25,296 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. అంతేకాక, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.20కి చేరింది.
వివరాలు
ఏ షేర్లు ఎలా..?
నిఫ్టీ సూచీలో కొన్ని కంపెనీల షేర్లు లాభంలో కొనసాగుతున్నాయి. వీటిలో హీరో మోటోకార్ప్ లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ట్రెంట్, ఆసియన్ పెయింట్స్, టాటా మోటార్స్ ఉన్నాయి. మరోవైపు, టెక్ మహీంద్రా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, లార్సెన్ అండ్ టుబ్రో వంటి షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టెక్ మహీంద్రా షేర్లు 6% కు పడిపోయాయి, అలాగే ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లలోనూ అదే తీరును చూడవచ్చు. హెచ్1బీ వీసా కొత్త నిబంధనలు 288 బిలియన్ డాలర్ల ఐటీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి, దీనివల్ల మార్కెట్లో స్పష్టమైన ఆందోళన నెలకొంది.