Loading...
Stock Market: మూడో రోజూ జోరు కొనసాగించిన స్టాక్‌ మార్కెట్‌.. లాభాల్లో ముగిసిన సూచీలు
మూడో రోజూ జోరు కొనసాగించిన స్టాక్‌ మార్కెట్‌.. లాభాల్లో ముగిసిన సూచీలు

Stock Market: మూడో రోజూ జోరు కొనసాగించిన స్టాక్‌ మార్కెట్‌.. లాభాల్లో ముగిసిన సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2026
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు,ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలపరిచాయి. ముఖ్యంగా ఆటోమొబైల్‌,ఫైనాన్షియల్‌ రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో ప్రధాన సూచీలు లాభాల బాట పట్టాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 166 పాయింట్లు పెరగగా,నిఫ్టీ 24,300 స్థాయికి ఎగువన ముగిసింది. ఉదయం సెన్సెక్స్‌ 77,998.66 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.

వివరాలు 

నిఫ్టీ @ 24,383.60

గత ముగింపు 77,928.15 పాయింట్లతో పోలిస్తే స్వల్ప లాభాల్లోనే ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీ, ఆరంభంలో కొద్దిసేపు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ అనంతరం కొనుగోళ్ల మద్దతుతో మళ్లీ పుంజుకుంది.

ఇంట్రాడేలో 78,272.25 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌, చివరకు 166.49 పాయింట్లు పెరిగి 78,094.64 వద్ద ముగిసింది.

నిఫ్టీ కూడా రోజంతా ఒడిదుడుకుల మధ్య ట్రేడై చివరకు 24,383.60 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.95.41గా నమోదైంది.

వివరాలు 

సెన్సెక్స్‌ 30

సెన్సెక్స్‌లోని 30 షేర్లలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌ షేర్లు ప్రధానంగా లాభపడగా.. టీసీఎస్‌, ఎటర్నల్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాలను చవిచూశాయి.

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 87 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 4,055 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ADVERTISEMENT