Loading...
Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 331 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 331 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 331 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2026
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టాక్ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ముఖ్యంగా ఐటీ, ఫార్మా, మెటల్‌ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు బలాన్నిచ్చింది. దీంతో వరుసగా రెండు రోజులుగా కొనసాగిన నష్టాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 300 పాయింట్లకుపైగా లాభపడగా.. నిఫ్టీ 24,150 స్థాయిని తిరిగి అధిగమించింది. లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. రోజంతా అదే జోరు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ గురువారం ముగింపు 76,933.59 పాయింట్లతో పోలిస్తే శుక్రవారం 77,128.05 వద్ద లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అనంతరం రోజంతా పాజిటివ్‌గానే కదలాడింది. ఇంట్రాడేలో 77,357.97 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 330.92 పాయింట్లు పెరిగి 77,264.51 వద్ద స్థిరపడింది.

వివరాలు 

24,150 ఎగువన నిఫ్టీ

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE) నిఫ్టీ కూడా లాభాలతో ముగిసింది. సూచీ 84.80 పాయింట్లు పుంజుకుని 24,175.65వద్ద స్థిరపడింది.

అంతకుముందు వరుసగా రెండు సెషన్లలో నష్టాలను నమోదు చేసిన మార్కెట్‌కు తాజా ర్యాలీ ఊరటనిచ్చింది.

ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

సెన్సెక్స్‌ 30లో టీసీఎస్‌,ఇన్ఫోసిస్‌,టెక్‌ మహీంద్రా,హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌,టైటాన్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి.

ముఖ్యంగా ఐటీ షేర్లలో కొనుగోళ్లు సూచీల రికవరీకి దోహదపడ్డాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, మారుతీ సుజుకీ షేర్లు నష్టాలను చవిచూశాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.39గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 88.30డాలర్ల వద్ద కొనసాగింది.

మరోవైపు బంగారం ఔన్సు ధర 4,603డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ADVERTISEMENT