Loading...
Balen' Shah: బాలెన్‌ షా తొలి విదేశీ పర్యటన భారత్‌కే.. నేపాల్‌ మంత్రి కీలక ప్రకటన
బాలెన్‌ షా తొలి విదేశీ పర్యటన భారత్‌కే.. నేపాల్‌ మంత్రి కీలక ప్రకటన

Balen' Shah: బాలెన్‌ షా తొలి విదేశీ పర్యటన భారత్‌కే.. నేపాల్‌ మంత్రి కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2026
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌ ప్రధాని బాలెన్‌ షా తన తొలి విదేశీ పర్యటనను భారత్‌తో ప్రారంభించనున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్‌ వాగ్లే వెల్లడించారు. ఈ ఏడాది ముగిసేలోపు ఆయన భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని తెలిపారు. కాఠ్‌మాండులో నిర్వహించిన ఎన్డీటీవీ అన్విక్షా సదస్సులో వాగ్లే ఈ వివరాలను వెల్లడించారు.

వివరాలు 

తొలి 100 రోజులు దేశీయ అంశాలపైనే..

బాలెన్‌ షా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి 100 రోజుల పాటు దేశంలోని కీలక సమస్యలు, పాలనకు సంబంధించిన అంశాలపైనే దృష్టి సారించారని వాగ్లే చెప్పారు.

ప్రభుత్వం నిర్దేశించుకున్న 100 అంశాల కార్యాచరణలో 87.2 శాతం పనులను ఇప్పటికే పూర్తి చేసినట్లు వివరించారు.

ఇప్పుడు విదేశీ పర్యటనలపై ప్రణాళికలు రూపొందించే దశకు ప్రభుత్వం చేరుకుందని తెలిపారు.

ఈ క్రమంలో బాలెన్‌ షా మొదటి విదేశీ పర్యటన భారత్‌లోనే ఉంటుందని స్పష్టం చేశారు.

వివరాలు 

భారత్‌-నేపాల్‌ బంధం ప్రత్యేకమైనది

బాలెన్‌ షా భారత్‌ పర్యటనకు సంబంధించిన ప్రకటనకు ఎంతో ప్రాధాన్యం ఉందని బీజేపీ ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

భారత్‌, నేపాల్‌ మధ్య సంబంధాలు ఎంతో బలమైనవని చెప్పారు.

రెండు దేశాల మధ్య ఉన్న అనుబంధాన్ని సరిహద్దులు, పాస్‌పోర్టులు కూడా విడదీయలేవని వ్యాఖ్యానించారు.

రూపాయి మారకం విషయంలో ఇప్పట్లో మార్పు లేదు

భారత రూపాయి, నేపాల్‌ రూపాయి మధ్య ప్రస్తుతం 1.6:1 మారకం నిష్పత్తి కొనసాగుతోంది.

ఈ వ్యవస్థను తక్షణమే మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్వర్ణిమ్‌ వాగ్లే తెలిపారు. దీనిపై ప్రస్తుతం అధ్యయనం మాత్రమే జరుగుతోందని వివరించారు.

మరోవైపు నేపాల్‌ మొత్తం వాణిజ్యంలో దాదాపు 70 శాతం భారత్‌తోనే జరుగుతోందని వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో 100 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా..

నేపాల్‌ ఆర్థికవ్యవస్థను రాబోయే ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వ్యవధిలో 100బిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వాగ్లే చెప్పారు.

ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కనీసం ఏడు శాతం ఆర్థిక వృద్ధి అవసరమని పేర్కొన్నారు.

ఆర్థిక వృద్ధిని పెంచేందుకు స్వచ్ఛ ఇంధనం, పర్యాటక రంగం,తయారీ,అధిక విలువను అందించే వ్యవసాయం,డిజిటలైజేషన్‌ వంటి రంగాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని వివరించారు.

పనులు,ఫలితాలకే బాలెన్‌ షా ప్రాధాన్యం

బాలెన్‌ షా సంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నమైన విధానాన్ని అనుసరిస్తున్నారని వాగ్లే అన్నారు.

సుదీర్ఘ ప్రసంగాల కంటే కార్యాచరణ,ఫలితాలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు.

అదే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు వాటికి సంబంధించిన చట్టపరమైన అంశాలను కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారని తెలిపారు.

ADVERTISEMENT