Stock Market:గ్లోబల్ ఎఫెక్ట్.. లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా సుప్రీంకోర్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలను రద్దు చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ట్రంప్ విధించిన భారీ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఇన్వెస్టర్లలో ఊరట కనిపించింది. దీంతో Nifty50 సూచీ 0.42శాతం ఎగిసి 25,678.4వద్ద ట్రేడ్ అవుతుండగా,BSE Sensex 0.11శాతం పెరిగి 82,906.83 వద్ద కొనసాగింది. ఓపెనింగ్లోనే 16ప్రధాన రంగాల్లో 14రంగాలు లాభాల్లో కనిపించాయి. స్మాల్క్యాప్ సూచీ 0.7శాతం, మిడ్క్యాప్ సూచీ 0.2శాతం పెరిగాయి. జాతీయ అత్యవసర పరిస్థితుల కోసం ఉద్దేశించిన చట్టం కింద ట్రంప్ అమలు చేసిన టారిఫ్లు గ్లోబల్ వాణిజ్యంపై పెద్ద ప్రభావం చూపుతాయని భావించిన నేపథ్యంలో,శుక్రవారం అమెరికా సుప్రీంకోర్టు వాటిని రద్దు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది.
వివరాలు
కొన్ని స్టాక్స్లో కొనసాగిన ఒత్తిడి
అయితే శనివారం స్పందించిన ట్రంప్, అన్ని దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై తాత్కాలిక సుంకాన్ని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచనున్నట్టు ప్రకటించారు. కోర్టు తీర్పు తర్వాత టారిఫ్ల విషయంలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో,ఈ వారం వాషింగ్టన్కు పంపాలని భావించిన వాణిజ్య ప్రతినిధి బృందాన్ని భారత్ తాత్కాలికంగా వాయిదా వేసినట్టు రాయిటర్స్ తెలిపింది. మరోవైపు షేర్లలో IDFC First Bank 10శాతం వరకు కుప్పకూలింది. స్థానిక ప్రభుత్వ సంస్థల ఖాతాలకు సంబంధించిన సుమారు 65 మిలియన్ డాలర్ల మోసం జరిగిందని,ఇందులో కొందరు ఉద్యోగులు పాత్ర ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తూ బ్యాంక్ దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించింది. మార్కెట్లో మొత్తం మీద సానుకూల ధోరణి కనిపించినప్పటికీ,కొన్ని స్టాక్స్లో మాత్రం ఒత్తిడి కొనసాగింది.