Page Loader
Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,641 నిఫ్టీ 
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,641 నిఫ్టీ

Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,641 నిఫ్టీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ప్రారంభంలో ఫ్లాట్‌గా కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్ నుండి వచ్చిన మిశ్రమ సంకేతాల మధ్య, సూచీలు ప్రారంభం తర్వాత త్వరగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 217 పాయింట్లు తగ్గి 77,972 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 66 పాయింట్లు కుంగి 23,641 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఎన్టీపీసీ, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, మారుతీ సుజుకీ, ఎంఅండ్ఎం, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

వివరాలు 

డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.82 

అంతర్జాతీయ మార్కెట్లో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర రూ.77.33 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు ధర రూ.2,661.30 వద్ద ట్రేడవుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.82 వద్ద ఉంది. అమెరికా మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు ఈ రోజు మిశ్రమంగా కదలాడుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.1,491 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.1,615 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.