NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 566, నిఫ్టీ 130 పాయింట్లు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 566, నిఫ్టీ 130 పాయింట్లు
    లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 566, నిఫ్టీ 130 పాయింట్లు

    Stock market : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 566, నిఫ్టీ 130 పాయింట్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 22, 2025
    04:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ప్రైవేటు బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో మంగళవారం నాటి షాక్‌ నుంచి రీబౌన్స్ అయ్యాయి.

    రోజంతా స్వల్ప మార్పులతో కదలాడిన సూచీలకు చివర్లో కొనుగోలుల మద్దతుతో లాభాలు చేరాయి.

    ఈ పరిణామంతో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడి, నిఫ్టీ 23,100 పాయింట్లను దాటి స్థిరపడింది.

    వివరాలు 

    నిఫ్టీ 130.70 పాయింట్ల లాభంతో 23,155.35 వద్ద స్థిరపడింది

    సెన్సెక్స్ 76,114.42 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 75,838.36) లాభాలతో ప్రారంభమైంది.

    ఉదయంనుండి స్వల్ప లాభాలతోనే కదలాడిన సూచీ, ఒక దశలో స్వల్ప నష్టాలను కూడా నమోదు చేసింది.

    అయితే, చివరి గంటలో భారీ కొనుగోలులతో సెన్సెక్స్ 566.63 పాయింట్ల లాభంతో 76,404.99 వద్ద ముగిసింది.

    నిఫ్టీ 130.70 పాయింట్ల లాభంతో 23,155.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 25 పైసలు పెరిగి 86.33 వద్ద ముగిసింది.

    వివరాలు 

    అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 79.64 డాలర్లు 

    సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

    టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, యాక్సిస్ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎన్టీపీసీ షేర్లు నష్టాలను ఎదుర్కొన్నారు.

    అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 79.64 డాలర్ల వద్ద కొనసాగగా, బంగారం ఔన్సు ధర 2771 డాలర్లను చేరుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    స్టాక్ మార్కెట్

    Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@23,800  బిజినెస్
    Upcoming IPOs: ఈ వారంలో ఐపీఓల హవా.. 3 సబ్‌స్క్రిప్షన్లు, 6 లిస్టింగ్‌లు ఐపీఓ
    Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు బిజినెస్
    Stock market:నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీ బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025