Stock Market: నష్టాలకు బ్రేక్.. 500 పాయింట్లకు పైగా లాభంలో దూసుకెళ్లిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో జూన్ నెల ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదవడం ప్రపంచ మార్కెట్లకు ఊరటనిచ్చింది. దీంతో ఆసియా స్టాక్ మార్కెట్లు లాభాల దిశగా కదులుతున్నాయి. ఇదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై విధించనున్న సుంకాలను 500 శాతం నుంచి 100 శాతానికి తగ్గించే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోందన్న వార్తలు కూడా పెట్టుబడిదారుల్లో సానుకూల భావనను పెంచాయి. ఇటీవలి రోజుల్లో వరుస నష్టాలు నమోదవడంతో కనిష్ఠ స్థాయిల్లో షేర్ల కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి చూపారు. ఈ పరిణామాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ట్రేడింగ్ను కొనసాగించాయి. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.11 వద్ద ఉంది.
వివరాలు
నిఫ్టీ @ 24,199
మంగళవారం ముగింపు స్థాయి 77,054తో పోలిస్తే బుధవారం ఉదయం సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది.
అనంతరం కొనుగోళ్లు మరింత పెరగడంతో ఉదయం 9:45 గంటల సమయానికి సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా ఎగిసి 77,554 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ కూడా సెన్సెక్స్ను అనుసరిస్తూ లాభాల్లో కొనసాగుతోంది. ఉదయం 9:45 గంటల సమయానికి నిఫ్టీ 147 పాయింట్లు పెరిగి 24,199 వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
లాభాల్లో ట్రేడవుతున్న ఈ షేర్లు
వ్యక్తిగత షేర్ల విషయానికి వస్తే.. బంధన్ బ్యాంక్, హ్యుందాయ్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, యూనో మిండా, ఐఈఎక్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
మరోవైపు పతంజలి ఫుడ్స్, టాటా ఎలాక్సీ, అదానీ పవర్, టీసీఎస్, హిందాల్కో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రంగాల వారీగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ 652 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ కూడా 359 పాయింట్లు పెరిగి మార్కెట్లో సానుకూల ధోరణిని ప్రతిబింబిస్తోంది.