Stock Market: స్టాక్ మార్కెట్ జోష్: 900 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ను గట్టిగా ప్రారంభించాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, భారత సూచీలు మాత్రం పాజిటివ్ దిశలో కదిలాయి. గత సెషన్లో గణనీయ నష్టాలు ఎదుర్కొన్న పెట్టుబడిదారులు కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్కు బలమైన మద్దతు లభించింది. దీంతో సెన్సెక్స్ ఒక దశలో 900 పాయింట్లకు పైగా ఎగసింది. ఉదయం 9:36 గంటల సమయంలో సెన్సెక్స్ 895 పాయింట్లు పెరిగి 75,123 స్థాయిలో ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 292 పాయింట్లు లాభపడి 23,294 వద్ద కొనసాగుతోంది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతుండటం గమనార్హం.
వివరాలు
డాలర్తో మారకం విలువ 92.92గా నమోదు
ఈ పరిస్థితి భారత రూపాయి విలువపై ఒత్తిడిని పెంచింది. ఫలితంగా రూపాయి జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం డాలర్తో మారకం విలువ 92.92 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, కోల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్ వంటి షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అయితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు మాత్రం నష్టాలను నమోదు చేస్తున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. అదే ధోరణి ఆసియా మార్కెట్లలో కూడా కనిపిస్తోంది. అయితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ సూచీలు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి.