NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / stock Market: భారీ నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభం  .. సెన్సెక్స్‌ 3000 పాయింట్లు డౌన్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    stock Market: భారీ నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభం  .. సెన్సెక్స్‌ 3000 పాయింట్లు డౌన్‌
    భారీ నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభం .. సెన్సెక్స్‌ 3000 పాయింట్లు డౌన్‌

    stock Market: భారీ నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభం  .. సెన్సెక్స్‌ 3000 పాయింట్లు డౌన్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 07, 2025
    10:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

    ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 3,233 పాయింట్ల నష్టంతో 72,130 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 1,022 పాయింట్ల నష్టంతో 21,882 వద్ద కొనసాగుతోంది.

    ట్రంప్ టారిఫ్‌లు మార్కెట్ పై తీవ్రమైన ప్రభావం చూపడంతో సూచీలు గణనీయంగా పడిపోయాయి.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఆంక్షల కారణంగా అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు విజృంభించాయి.

    దీని ప్రభావంతో ప్రపంచ మార్కెట్ల మనోభావాలు బలహీనంగా మారాయి. ఈ వారం ఆ ప్రభావం ఇంకా స్పష్టంగా కనిపిస్తూ, ముందస్తు ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ ఒక దశలో 4,000 పాయింట్లకు పైగా పడిపోయింది.

    వివరాలు 

    అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా మైనస్‌లో..

    ఆసియా మార్కెట్లు ఇప్పటికే సోమవారం ఉదయం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

    2008 ఆర్థిక మాంద్యానంతరం తొలిసారిగా ఇటువంటి తీవ్రమైన పతనాన్ని ఆసియా మార్కెట్లు ఎదుర్కొంటున్నాయి.

    జపాన్ నిక్కీ సూచీ ఒక దశలో 8 శాతం వరకు పడిపోగా,ప్రస్తుతం 6 శాతం నష్టంతో ట్రేడవుతోంది.

    తైవాన్ సూచీ 9.61 శాతం,దక్షిణ కొరియా కోస్పి 4.14 శాతం, చైనా షాంఘై సూచీ 6.5 శాతం,ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ సూచీ 3.82 శాతం మేర నష్టాల్లో ఉన్నాయి.

    ఇక అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా మైనస్‌లో కొనసాగుతున్నాయి.డోజోన్స్ సూచీ 2.2 శాతం పడిపోయింది.

    ఈ నేపథ్యంలో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాలను నమోదు చేసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    వివరాలు 

    రూ.20 లక్షల కోట్లు పైనే ఆవిరి 

    మరోవైపు, భారత గిఫ్ట్ నిఫ్టీ సూచీ 900 పాయింట్లకు పైగా పడిపోయింది.

    దీని ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు ప్రారంభ ట్రేడింగ్‌లోనే భారీ నష్టాలను చవిచూశాయి.

    సెన్సెక్స్ 3.5 శాతానికి పైగా క్షీణించగా, నిఫ్టీకి ఇది 2020 తర్వాత ఎదురైన అతి భారీ పతనం.

    ఈ క్రమంలో నిఫ్టీలో నమోదు అయిన కంపెనీల కలిపి మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్లు పైనే ఆవిరైపోయింది.

    అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశం ఉన్నదన్న భయాల నేపథ్యంలో లోహ రంగ షేర్లు బలమైన నష్టాలను ఎదుర్కొన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్
    pak spy:పాక్‌కు సైనిక రహస్యాలు లీక్‌ చేసిన ఇంజినీర్‌.. మహారాష్ట్రలో అరెస్టు మహారాష్ట్ర
    GT vs MI Records: ఎలిమినేటర్ మ్యాచ్‌లో నమోదైన అద్భుతమైన రికార్డులివే! ముంబయి ఇండియన్స్
    Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి బాలుడి ఘన విజయం భారతదేశం

    స్టాక్ మార్కెట్

    Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 37 పాయింట్లతో లాభపడిన నిఫ్టీ  బిజినెస్
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ.. నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు బిజినెస్
    Stock market:స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  బిజినెస్
    Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @22,482  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025