Loading...
Stock market: స్టాక్‌ మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలు.. 113 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
స్టాక్‌ మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలు.. 113 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

Stock market: స్టాక్‌ మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలు.. 113 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ స్వల్ప లాభంతో ముగియగా.. నిఫ్టీ వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలను నమోదు చేసింది. హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడంపై కొనసాగుతున్న అనిశ్చితి, అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. దీంతో మార్కెట్‌లో తీవ్ర ఒడుదొడుకులు కనిపించాయి. ముఖ్యంగా మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, బ్యాంకింగ్‌, కన్జూమర్‌ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి నమోదైంది. దీంతో ట్రేడింగ్‌ సమయంలో సూచీలు పలుమార్లు లాభనష్టాల మధ్య కదలాడాయి. చివరకు సెన్సెక్స్‌ లాభాల్లో స్థిరపడగా.. నిఫ్టీ నష్టాలతో ముగిసింది.

వివరాలు 

బంగారం ఔన్సు ధర 4,381.47 డాలర్లు 

రోజు ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 113.61 పాయింట్లు పెరిగి 78,079.96 వద్ద స్థిరపడింది.

మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 40.10 పాయింట్లు కోల్పోయి 24,395.85 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.44 వద్ద కొనసాగింది.

సెన్సెక్స్‌ 30లో ఇండిగో, ఎన్‌టీపీసీ, బీఈఎల్‌, ఎల్‌అండ్‌టీ, హిందూస్థాన్‌ యునిలీవర్‌, ఎటర్నల్‌ షేర్లు లాభాలను నమోదు చేశాయి.

మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటాన్‌, రిలయన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి.

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 87.79 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు బంగారం ఔన్సు ధర 4,381.47 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ADVERTISEMENT