Stock Market: ఐటీ షేర్ల అమ్మకాలతో కుదేలైన మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు, కొత్త ఫీచర్లతో ముందుకొస్తున్న ఏఐ టూల్స్పై ఉన్న ఆందోళనలు దేశీయ ఐటీ రంగంపై ప్రభావం చూపించాయి. దీంతో ఐటీ షేర్లలో భారీగా అమ్మకాలు నమోదై, సూచీల సెంటిమెంట్ బలహీనపడింది. ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్ల వరకూ క్షీణించింది.
వివరాలు
రూపాయి 90.96 గా నమోదు
ఉదయం 9.54 గంటల సమయానికి సెన్సెక్స్ 731 పాయింట్లు పడిపోయి 82,567 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 201 పాయింట్లు తగ్గి 25,511 స్థాయిలో కదులుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు బలహీనపడి 90.96 వద్ద నమోదైంది. నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్టెల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.