LOADING...
Stock Market: స్టాక్ మార్కెట్‌లో జోష్.. కొత్త రికార్డుల్లో సెన్సెక్స్,నిఫ్టీ 
స్టాక్ మార్కెట్‌లో జోష్.. కొత్త రికార్డుల్లో సెన్సెక్స్,నిఫ్టీ

Stock Market: స్టాక్ మార్కెట్‌లో జోష్.. కొత్త రికార్డుల్లో సెన్సెక్స్,నిఫ్టీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 01, 2025
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ షేర్‌ మార్కెట్లు ఈ వారం ఉత్సాహంతో ఆరంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న అనుకూల సంకేతాలు, అలాగే రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల కోతపై ఉన్న ఆశావహ అంచనాలు ఇన్వెస్టర్లలో జోష్‌ను పెంచాయి. ఈ పరిస్థితుల్లో బుల్‌ పట్టు బిగించడంతో ప్రధాన సూచీలు కొత్త గరిష్టాలను తాకుతూ ముందుకుసాగుతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 86 వేల స్థాయిని దాటగా, నిఫ్టీ 26,300 పైన బలంగా కదులుతోంది.

వివరాలు 

 బ్యాంక్‌ నిఫ్టీ తొలిసారిగా 60 వేల మార్క్

ఉదయం సుమారు 9.40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 383 పాయింట్ల లాభంతో 86,089 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 108 పాయింట్లు ఎగబాకి 26,311 స్థాయిలో కొనసాగుతోంది. నిఫ్టీలో ఎస్‌బీఐ, ట్రెంట్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు మంచి ప్రదర్శన చూపుతుండగా, టెక్‌ మహీంద్రా, టాటా కన్స్యూమర్‌, టైటాన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు స్వల్ప ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మరోవైపు బ్యాంక్‌ నిఫ్టీ తొలిసారిగా 60 వేల మార్క్‌ను అధిగమించి చరిత్రలో కొత్త మైలురాయి నమోదు చేసింది.

Advertisement