LOADING...
Stock market: మూడో రోజూ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 25,900 దిగువకు నిఫ్టీ
మూడో రోజూ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 25,900 దిగువకు నిఫ్టీ

Stock market: మూడో రోజూ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 25,900 దిగువకు నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడోరోజు కూడా ప్రతికూలంగా ముగిశాయి. ట్రేడింగ్‌ సెషన్‌ మొత్తం పరిమిత శ్రేణిలో ఊగిసలాడిన సూచీలు.. అంతర్జాతీయ మార్కెట్లలో కనిపించిన బలహీన ధోరణి,ఐటీ రంగ షేర్లపై పెరిగిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాలను నమోదు చేశాయి. అలాగే నిఫ్టీ నవంబర్‌ సిరీస్‌ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ ప్రభావం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌పై పడింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 25,900 స్థాయి కంటే దిగువకు జారిపోయింది. సెన్సెక్స్‌ ఉదయం 85,008.93 వద్ద (మునుపటి ముగింపు 84,900.71) స్వల్ప లాభాలతో ప్రారంభమై,ఇంట్రాడేలో 84,536.73 నుంచి 85,110.24 వరకు కదిలింది. చివరికి 313.70 పాయింట్లు కోల్పోయి 84,587.01 వద్ద రోజు ముగిసింది.

వివరాలు 

రూపాయి విలువ 89.20గా నమోదు 

నిఫ్టీ కూడా 74.70 పాయింట్ల నష్టంతో 25,884.80 వద్ద స్థిరపడింది. రూపాయి-డాలర్‌ మారకంలో రూపాయి విలువ 89.20గా నమోదైంది. సెన్సెక్స్‌-30లో టీఎంపీవీ, ట్రెంట్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు గణనీయంగా వెనకబడ్డాయి. మరోవైపు బీఈఎల్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, ఎటెర్నల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 63 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు ధర 4135 డాలర్ల వద్ద కొనసాగుతోంది.