LOADING...
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. పెట్టుబడిదారులకు ఊరట
లాభాల్లో ముగిసిన సూచీలు.. పెట్టుబడిదారులకు ఊరట

Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. పెట్టుబడిదారులకు ఊరట

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2026
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నిన్న ఎదురైన భారీ పతనాన్ని దాటుకుని ఈరోజు కోలుకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ మన మార్కెట్లు స్థిరంగా నిలవడం విశేషంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లు, మెటల్‌ రంగానికి చెందిన స్టాక్స్‌లో కొనుగోళ్లు పెరగడం సూచీలకు బలాన్నిచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ ఉదయం 82,272.49 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.గత సెషన్‌లో ఇది 82,498.14 వద్ద ముగిసింది. ఆరంభంలో స్వల్ప నష్టాల్లో ట్రేడైన సూచీ తర్వాత లాభాల బాట పట్టింది. రోజు మధ్యలో 83,132.08 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 316.57 పాయింట్లు పెరిగి 82,814.71 వద్ద ముగిసింది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 71.11 డాలర్లు 

ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 116.90 పాయింట్లు ఎగిసి 25,571.25 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.02గా నమోదైంది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఎన్టీపీసీ, ఎల్‌అండ్‌టీ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు లాభాల దిశగా సాగాయి. మరోవైపు క్వాలిటీవాల్స్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఎటర్నల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ స్టాక్స్‌ నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 71.11 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్సు ధర 5025 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ జరుగుతోంది.

Advertisement