LOADING...
Stock market: రెండో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
రెండో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

Stock market: రెండో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2026
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల దిశలోనే ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్‌ రంగంతో పాటు ఐటీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు స్వల్ప లాభాలతో స్థిరపడ్డాయి. ముంబై స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సెన్సెక్స్‌ 173.81 పాయింట్లు పెరిగి 83,450.96 స్థాయిలో ముగిసింది. అదే విధంగా నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ నిఫ్టీ 42.65 పాయింట్ల లాభంతో 25,725.40 వద్ద ముగిసింది. విదేశీ కరెన్సీ మార్కెట్లో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.68గా నమోదైంది.

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 68.18 డాలర్లు 

సెన్సెక్స్‌ 30 షేర్లలో ఐటీసీ, బీఈఎల్‌, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. మరోవైపు ఎటెర్నల్‌, టాటా స్టీల్‌, ట్రెంట్‌, రిలయన్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 68.18 డాలర్ల స్థాయిలో కొనసాగుతోంది. అలాగే బంగారం ధర ఔన్సుకు 4,936.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement