LOADING...
stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@ 26,142 
నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@ 26,142

stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@ 26,142 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టంతో ముగిసాయి. విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగించడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అంతేకాదు,సూచీలు గరిష్ఠ స్థాయిల వద్ద ఉండటంతో లాభాల స్వీకరణ కూడా మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది. రిలయన్స్‌, ఐసీఐసీఐ వంటి కీలక స్టాక్స్‌లో భారీ అమ్మకాలు సూచీలను నష్టాల్లోకి దింపాయి. ఆయిల్ & గ్యాస్‌, ఫార్మా, ఐటీ రంగాల షేర్లలో కూడా అమ్మకాలు కొనసాగాయి. క్రిస్మస్‌ సందర్భంగా గురువారం మార్కెట్లు మూతపడటంతో ట్రేడింగ్‌ పరిమితం అయ్యింది. సెన్సెక్స్‌ ఉదయం 85,533.11 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 85,524.84) స్వల్ప లాభంతో ప్రారంభమైంది. ప్రారంభంలో కొంత కాలం లాభాల్లో కొనసాగిన సూచీ.. తర్వాత నష్టాల వైపు పరిగెత్తింది.

వివరాలు 

డాలరుతో రూపాయి మారకం విలువ 89.78గా నమోదు 

ఇంట్రాడేలో కనిష్టంగా 85,342.19 పాయింట్ల వద్ద పడింది. చివరికి 116.14 పాయింట్ల నష్టంతో 85,408.70 వద్ద ముగిసింది. నిఫ్టీ 35.05 పాయింట్ల నష్టంతో 26,142.10 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 89.78గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండిగో, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, హిందుస్థాన్ యూనిలీవర్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అదే సమయంలో ట్రెంట్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, మారుతీ సుజుకీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్ ధర 62.51 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 4,494 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement