NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: ట్రంప్ ప్రభావంతో.. భారత ఇన్వెస్టర్లకు రూ.45లక్షల కోట్ల రూపాయలు ఆవిరి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market: ట్రంప్ ప్రభావంతో.. భారత ఇన్వెస్టర్లకు రూ.45లక్షల కోట్ల రూపాయలు ఆవిరి
    ట్రంప్ ప్రభావంతో.. భారత ఇన్వెస్టర్లకు రూ.45లక్షల కోట్ల రూపాయలు ఆవిరి

    Stock market: ట్రంప్ ప్రభావంతో.. భారత ఇన్వెస్టర్లకు రూ.45లక్షల కోట్ల రూపాయలు ఆవిరి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 07, 2025
    12:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి భారతీయ పెట్టుబడిదారుల సంపదలో భారీ నష్టం సంభవించింది.

    తాజా గణాంకాల ప్రకారం, భారత్‌లో సుమారు రూ.45.57 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయింది.

    జనవరి 20నాటికి దేశంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,31,59,726 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం అది రూ.3,86,01,961 కోట్లకు తగ్గిపోయింది.

    మార్కెట్‌లో అస్థిరత,పెట్టుబడిదారుల్లో భయాన్ని సూచించే విక్స్ సూచీ భారీగా పెరిగింది.

    ఉదయం 11:37 గంటల సమయంలో నిఫ్టీ 851 పాయింట్లు కోల్పోయి 22,052 స్థాయిలో, అలాగే సెన్సెక్స్ 2,638 పాయింట్లు పడిపోయి 72,744 వద్ద కొనసాగుతున్నాయి.

    వివరాలు 

    ఒక్కరోజే రూ.20 లక్షల కోట్ల నష్టం! 

    సోమవారం ఒక్కరోజే పెట్టుబడిదారుల సంపదలో రూ.20.16 లక్షల కోట్ల మేర నష్టం నమోదైంది.

    సెన్సెక్స్ ఒక దశలో 5.22 శాతం మేరకు పతనమైంది. బీఎస్‌ఈలో లిస్టయ్యిన కంపెనీల మొత్తం విలువ 4.5 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది.

    టాటా స్టీల్, టాటా మోటార్స్ షేర్లు 10 శాతానికి పైగా నష్టపోయాయి. అలాగే, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు కూడా భారీ నష్టాన్ని చవిచూశాయి.

    వివరాలు 

    అబ్బో ఇవేం గణాంకాలు.. 

    బీఎస్‌ఈలో లిస్టయ్యిన 725 కంపెనీల షేర్లు నేటి ట్రేడింగ్‌లో 52 వారాల కనిష్ఠాలను తాకాయి.

    వీటిలో భారత్ ఫోర్జ్, బాటా ఇండియా, బజాజ్ ఆటో, డాబర్ ఇండియా వంటి కంపెనీలు ఉన్నాయి.

    అంతేకాదు, 517 కంపెనీల షేర్లు నేరుగా లోయర్ సర్క్యూట్‌కు వెళ్లిపోయాయి. ఇది మార్కెట్‌లో నెలకొన్న తీవ్రమైన ఒడిదుడుకులను సూచిస్తుంది.

    వివరాలు 

    రూపాయి విలువ కూడా పతనం.. 

    నేటి మార్కెట్ సెషన్‌లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 19 పైసలు పడిపోయి రూ.85.63కి చేరింది.

    ప్రపంచ వాణిజ్య యుద్ధం ఉత్కంఠను నెలకొల్పడంతో.. ముఖ్యంగా అమెరికా, చైనా పరస్పరం భారీ పన్నులు విధించుకోవడం వల్ల..ఈ పరిస్థితి ఏర్పడింది.

    ఈ నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తలపెట్టిన సమావేశంపై పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    బుధవారం నాడు కేంద్ర బ్యాంకు తీసుకునే నిర్ణయాలు రూపాయి దిశను నిర్దేశించే అవకాశం ఉంది.

    నిపుణుల అంచనాల ప్రకారం, ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డొనాల్డ్ ట్రంప్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    డొనాల్డ్ ట్రంప్

    Donald Trump: ఉక్రెయిన్ కంటే రష్యాతో డీల్‌ చేయడం చాలా సులభం : ట్రంప్‌ జెలెన్‌స్కీ
    Stock market: ట్రంప్ విధానాల ప్రభావం.. భారీ నష్టాల్లో టాప్ 100 కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్
    Trump: అమెరికాలో ఆర్థిక మాంద్యం వార్తలు.. తోసిపుచ్చిన డొనాల్డ్‌ ట్రంప్‌..!  అంతర్జాతీయం
    Trump Buys Tesla car: టెస్లా కారును కొనుగోలు చేసిన  ట్రంప్..  ఇచ్చిన మాట ప్రకారం కారు కొన్న అమెరికా అధ్యక్షుడు  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025